విద్యార్థినులకు వరం.. పుదుమైప్పెన్ పథకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పుదుమైప్పెన్’ పథకం విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ (పాతచిత్రం)
రెడ్హిల్స్, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పుదుమైప్పెన్’ పథకం విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఉన్నత ఆశయంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 1989లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనే పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. 1990లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి అతివలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు నాంది పలికారు. ఆ కోవలో ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలను మరింత పెంచేందుకు దోహదపడ్డారు. విద్యార్థినులు చదువుకు స్వస్తి చెప్పడాన్ని నివారించేందుకు, ఉన్నత విద్య కొనసాగించడానికి ప్రోత్సాహించేందుకు ‘పుదుమైప్పెన్’ పథకాన్ని తిరువళ్ళూరు సమీప పట్టాభిరాంలో ఫిబ్రవరి 8న ప్రారంభించారు. పాఠశాల చదువు పూర్తిచేసి కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థినికి నెలకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకు ఖాతాలో వేయడమే పథక ఉద్దేశం. ఈ పథకానికి సాంఘిక సంక్షేమశాఖ ద్వారా నెలకు రూ.4.78 కోట్లను కేటాయిస్తున్నారు. మంత్రి నాజర్, కలెక్టరు ఆల్ఫిజాన్వర్గీస్ తిరువళ్ళూరు జిల్లాలో ఈ పథకం అమలుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఓ విద్యార్థినికి సాయం అందజేస్తున్న మంత్రి నాజర్
చదువు ఖర్చులు తీరుతున్నాయి
పొన్నేరి సమీప రెడ్డిపాళ్యానికి చెందిన పవిత్ర పొన్నేరిలోని ప్రభుత్వ ఉలగనాథన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తొలి ఏడాది చదువుతోంది. తండ్రి శేఖర్ రైతు కూలి. చాలీచాలని ఆదాయంతో గడుపుతున్న తన కుటుంబానికి ఈ పథకం కింద ప్రతి నెల అందిస్తున్న రూ.వెయ్యి ఎంతో ఉపయోగకరంగా ఉందని, చదువు ఖర్చులు తీరుతున్నాయని పవిత్ర అంటోంది.
పవిత్ర, విద్యార్థిని
సీఎంకు కృతజ్ఞతలు
తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో కామర్స్ తొలి ఏడాది చదువుతున్న మహాలక్ష్మి తండ్రి వీరాంజి రైతు కూలీ. పేదరికంలో మగ్గుతున్న తనకు నెలకు రూ.వెయ్యి అందిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్కు రుణపడి ఉన్నట్లు మహాలక్ష్మి పేర్కొన్నారు.
మహాలక్ష్మి, విద్యార్థిని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్