లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ
లైంగిక వేధింపుల ఫిర్యాదుల గురించి జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు కళాక్షేత్రంలో రహస్యంగా విచారణ జరపడంతో ఉద్రిక్తత నెలకొంది.
విద్యార్థినుల ఆందోళన
ప్లకార్డులతో ర్యాలీగా వెళ్తున్న విద్యార్థినులు
ప్యారిస్, న్యూస్టుడే: లైంగిక వేధింపుల ఫిర్యాదుల గురించి జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు కళాక్షేత్రంలో రహస్యంగా విచారణ జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. అడయారు కళాక్షేత్రంలో ప్రొఫెసరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకున్నారు. విషయం తెలుసుకున్న జాతీయ మహిళా కమిషన్.. రాష్ట్ర డీజీపీ విచారించాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో కళాక్షేత్రానికి చెందిన విద్యార్థిని తన పేరుని కావాలనే ఉపయోగించి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని, ఈ విషయమై చర్యలు చేపట్టాలని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో జాతీయ మహిళా కమిషన్ డీజీపీకి పంపిన నోటీసుని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో అడయారు కళాక్షేత్రంలో గురువారం 3 గంటల పాటు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖశర్మ రహస్యంగా విచారణ జరిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల వద్ద విచారణ జరిపినట్లు తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూని కూడా తీసుకెళ్లకుండా కమిషన్ అధ్యక్షురాలు విచారణ జరపడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంటు ప్రొఫెసరుని సస్పెండు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు గురువారం ఆందోళన చేపట్టారు. కళాక్షేత్రం ఫౌండేషన్ డైరెక్టరు రేవతి రామచంద్రన్ విద్యార్థినులతో చర్చించినా ఆందోళన విరమించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా