కక్షసాధింపు చర్యలకు భయపడం: ముకుల్ వాస్నిక్
భాజపా కక్షసాధింపు చర్యలకు కాంగ్రెస్ భయపడబోమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు. నగరంలోని సత్యమూర్తి భవన్లో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు.
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముకుల్ వాస్నిక్
చెన్నై : భాజపా కక్షసాధింపు చర్యలకు కాంగ్రెస్ భయపడబోమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్ వాస్నిక్ తెలిపారు. నగరంలోని సత్యమూర్తి భవన్లో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. అదానీ కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారని విమర్శించారు. అదానీ గురించి ప్రశ్నించడంతోనే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏఐసీసీ అన్నిటికీ సిద్ధమన్నారు. అదానీ అక్రమాల గురించి లోక్సభలో రాహుల్ ప్రసంగించిన 9 రోజులకు ఆయనపై పరువునష్టం కేసుకు ప్రాణం పోశారని తెలిపారు. లోక్సభలో రాహుల్, రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని తెలిపారు. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విచారణను కోరిన ప్రతిపక్షాలను భాజపా పట్టించుకోలేదని పేర్కొన్నారు. లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గాన్ని కించపరిచినట్టు కేసు పెట్టారని, కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లో రాహుల్ ఎంపీ పదవిపై వేటు వేశారని పేర్కొన్నారు. ఈ కక్షసాధింపు చర్యలను చూసి కాంగ్రెస్ భయపడబోదని తెలిపారు.
ఈవీకేఎస్ ఇళంగోవన్కు పరామర్శ
చెన్నై : అనారోగ్యంతో శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఈరోడు తూర్పు ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ను ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్ వాస్నిక్ శుక్రవారం పరామర్శించారు. వెంట ఎంపీలు తిరునావుక్కరసర్, విజయ్ వసంత్, విష్ణు ప్రసాద్, ఎమ్మెల్యే రూబి మనోహరన్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM