logo

Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం: కమల్‌హాసన్‌

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కోయంబత్తూరు నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు రాష్ట్రంలో చర్చ నడుస్తున్న క్రమంలో దీనిపై కమల్‌ స్పష్టత ఇచ్చారు.

Updated : 29 Apr 2023 08:51 IST

విలేకరులతో మాట్లాడుతున్న ఎంఎన్‌ఎం అధ్యక్షుడు

కోయంబత్తూరు, వేలచ్చేరి, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కోయంబత్తూరు నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు రాష్ట్రంలో చర్చ నడుస్తున్న క్రమంలో దీనిపై కమల్‌ స్పష్టత ఇచ్చారు. పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కోయంబత్తూరు అవినాశి రోడ్డులోని కల్యాణ మండపంలో పార్టీ సమావేశం శుక్రవారం జరిగింది. లోక్‌సభ ఎన్నికల గురించి కోయంబత్తూరు, సేలం మండలాల ఇన్‌ఛార్జులతో కమల్‌హాసన్‌ సమావేశమయ్యారు. అనంతరం కమల్‌ విలేకరులతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో ప్రచారానికి వెళ్లే విషయంపై శనివారం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని