Tamilnadu: ఈపీఎస్, ఓపీఎస్ బల నిరూపణకు సన్నాహాలు.. శశికళ, దినకరన్ల హాజరు?
మదురై వేదికగా బల నిరూపణకు ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పూర్తిగా పళనిస్వామి వశమైంది. ఎన్నికల కమిషన్ కూడా ఇటీవల తన అధికారిక వెబ్సైట్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు ఉంచింది.
మదురై వేదికగా భారీ మహాసభ
సైదాపేట, న్యూస్టుడే : మదురై వేదికగా బల నిరూపణకు ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పూర్తిగా పళనిస్వామి వశమైంది. ఎన్నికల కమిషన్ కూడా ఇటీవల తన అధికారిక వెబ్సైట్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు ఉంచింది. సవరించిన అన్నాడీఎంకే నిబంధనలు విడుదల చేసింది. మరోపక్క కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఓపీఎస్ వర్గం చెబుతోంది. ఇటీవల ఓపీఎస్ నేతృత్వంలో తిరుచ్చి భారీ మహాసభ నిర్వహించారు. దీనికి అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు బాగానే హాజరయ్యారు. దీంతో దీనికి కొనసాగింపుగా పలు చోట్ల నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలవారీగా కార్యకర్తలను కలవనున్నట్లు ఓపీఎస్ వర్గం తెలిపింది. ముఖ్యంగా ఈపీఎస్ సొంత జిల్లా అయిన సేలంలో సభకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి ముందు మదురైలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
టీటీవీతో భేటీ
ఇటీవల ఏఎఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం కలిసిన సంగతి తెలిసిందే. సీనియర్ నేత బన్రూట్టి రామచంద్రన్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఇందులో బన్రూట్టి రామచంద్రన్తోపాటు మాజీ ఎంపీ సయ్యద్ఖాన్ పాల్గొన్నారు. ఓపీఎస్ వెన్నంటి ఉన్న వైద్యలింగం, జేసీటీ ప్రభాకర్, మనోజ్ పాండియన్లు భేటీలో పాల్గొనకపోవటం గమనార్హం. ఆ భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఓపీఎస్... దినకరన్తో కలిసి పని చేయనున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకేను కాపాడి నిజమైన కార్యకర్తల చేతికి అప్పగిస్తామని తెలిపారు. త్వరలో శశికళను కూడా కలవనున్నట్లు ఓపీఎస్ ప్రకటించారు.
సభ రూపంలో సత్తా..
ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు మదురైలో పోటాపోటీగా భారీ మహాసభలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పళనిస్వామి తన వర్గంలోని మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్, సెల్లూరు రాజులకు ఆ పనులు అప్పగించారు. వారు ఇప్పటినుంచే ఈపీఎస్ మహాసభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యేలా పనులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సారి ఓపీఎస్, టీటీవీ దినకరన్ల మద్దతుదారులు కలిసి మదురై మహానాడు ఏర్పాటు పనులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో శశికళ పాల్గొనేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ నేత బన్రూట్టి రామచంద్రన్ దీనికి సంబంధించి శశికళతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకే వేదికపై ఓపీఎస్, టీటీవీ, శశికళలు పాల్గొనేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికలే లక్ష్యం
త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్నందున అన్నాడీఎంకే వర్గాల ఈ బల నిరూపణ యత్నాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లోపు భారీ మహాసభలతో తమ బలాలు నిరూపించే యత్నంలో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నిల్లోపు ఓపీఎస్ ఏం చేస్తారు? ప్రత్యేక పార్టీ పెడతారా? టీటీవీ, ఓపీఎస్, శశికళ కలిస్తే భాజపా ఏం చేయనుంది? వంటి పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో కూటమి లెక్కలు మారే అవకాశాలు కూడా ఉందని విశ్లేషకుల అంచనా. భాజపాతో పొత్తు గురించి అన్నాడీఎంకే ఆలోచించాలని వీసీకే అధ్యక్షుడు తిరుమా తరచుగా చెబుతున్నారు. ఒకవేళ అన్నాడీఎంకే కూటమిలో భాజపా లేకుంటే తిరుమావళవన్ చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. అలాగే పీఎంకే కూడా డీఎంకే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే- భాజపా కూటమి కొనసాగుతుందా? ఓపీఎస్, టీటీవీ, శశికళలకు భాజపా మద్దతిస్తుందా? తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు