Sarath Babu: తమిళనేల మెచ్చిన తెలుగుబిడ్డ.. ‘జయ’ సరసన చివరి హీరో..
శరత్బాబు.. తమిళతెరపై తన ప్రత్యేకత చాటుకున్న తెలుగుతేజం. ఇక్కడి ప్రేక్షకుల మనసులో ‘మనవాడు’గా స్థానాన్ని సంపాదించుకున్న నటుడు.
శరత్బాబు
కోడంబాక్కం, న్యూస్టుడే: శరత్బాబు.. తమిళతెరపై తన ప్రత్యేకత చాటుకున్న తెలుగుతేజం. ఇక్కడి ప్రేక్షకుల మనసులో ‘మనవాడు’గా స్థానాన్ని సంపాదించుకున్న నటుడు. హీరో, డాక్టర్, స్నేహితుడు, విదేశీ పెళ్లికొడుకు, గ్రామానికి వెళ్లే పట్టణం కుర్రాడు.. ఇలా పలు పాత్రలు పోషించి మెప్పించారు. 1973 నుంచే తెలుగు చిత్రాల్లో నటించిన శరత్బాబు.. 1977లో కె.బాలచందర్ దర్శకత్వంలోని ‘పట్టిణప్రవేశం’ చిత్రం ద్వారా తమిళ సినిమాలో అడుగుపెట్టారు. ఆయన తెరపై విడుదలైన తొలి తమిళ చిత్రం ‘నిళల్ నిజమానదు’ (నీడ నిజమైనది). ఇది కూడా బాలచందర్ దర్శకత్వంలోనిదే. ఇందులో కమల్హాసన్కు స్నేహితుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘వట్టత్తుక్కుళ్ సదురం’, ‘ముళ్లుం మలరుం’, ‘అగల విళక్కు’, ‘నినైత్కాలే ఇనిక్కు’, ‘నెంజత్తై కిళ్లాదే’ వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. కొంతకాలానికి ఆయన తమిళనటుడిగానే ఇక్కడి ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. అంతేకాకుండా ‘దిసై మారియ పరవైగళ్’, ‘పొన్నగరం’, ‘ఉచ్చకట్టం’, ‘కన్నిల్ తెరియుం కదైగళ్’, ‘నదియై తేడివంద కడల్’, ‘మెట్టి’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.
‘ముత్తు’లో రజనీకాంత్తో..
శివాజి గణేశన్తో కూడా పలు చిత్రాల్లో కలసి నటించారు శరత్బాబు. ‘కీళ్వానం సివక్కుం’, ‘తీర్పు’, ‘సందిప్పు’, ‘ఎళుదాద సట్టంగళ్’ వంటి చిత్రాల్లో శివాజితో కలసి నటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథానాయికగా నటించిన ‘నదియై తేడివంద కడల్’ చిత్రంలో హీరోగా మెప్పించారు. అదే ఆమె నటించిన చివరి చిత్రం. ఇక రజనీకాంత్కు స్నేహితుడిగా పలు సినిమాలు చేశారు. ‘ముల్లుం మలరుం’, ‘నెట్రిక్కన్’, ‘వేలైక్కారన్’, ‘అన్నామలై’, ‘ముత్తు’ చిత్రాలతో ఆయన తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల్లోని శరత్బాబు పాత్రల పేర్లు కూడా సుస్థిరంగా నిలిచిపోయినవే కావడం విశేషం.
‘నదియై తేడివంద కడల్’లో..
తీరని విషాదం..
నటుడిగా చెరగని ముద్రవేసుకున్న శరత్బాబు అనారోగ్యంతో ఉన్నప్పటి నుంచే కోలీవుడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శరత్బాబు ఇకలేరన్న మాట విని పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంచి నటుడు, స్నేహితుడిని కోల్పోయినట్లు కమల్హాసన్ పేర్కొన్నారు. తీవ్ర ఆవేదనకు గురవుతున్న నటి రాధిక సంతాపం ప్రకటించారు.
‘ముళ్లుం మలరుం’లో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.