రూ.600 కోట్లతో తిరుచ్చిలో ఐటీ పార్క్
తిరుచ్చిలో రూ.600 కోట్ల ఖర్చుతో ఐటీ పార్క్ ఏర్పాటు కానుందని మంత్రి కేఎన్ నెహ్రూ తెలిపారు. తిరుచ్చి జిల్లా ఎడమలై పట్టిపుదూర్ ప్రాంతంలో రూ.90కోట్ల ఖర్చుతో అన్ని వసతులతో కూడిన కార్పొరేషన్ మహోన్నత పాఠశాల నిర్మాణ పనులకు మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ గురువారం శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేఎన్ నెహ్రూ
ఆర్కేనగర్, న్యూస్టుడే: తిరుచ్చిలో రూ.600 కోట్ల ఖర్చుతో ఐటీ పార్క్ ఏర్పాటు కానుందని మంత్రి కేఎన్ నెహ్రూ తెలిపారు. తిరుచ్చి జిల్లా ఎడమలై పట్టిపుదూర్ ప్రాంతంలో రూ.90కోట్ల ఖర్చుతో అన్ని వసతులతో కూడిన కార్పొరేషన్ మహోన్నత పాఠశాల నిర్మాణ పనులకు మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కార్పొరేషన్ పాఠశాలను రూ.9.90కోట్ల ఖర్చుతో దిల్లీ మోడల్ బడిలా నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే జనవరిలోపు ప్రారంభం అవుతుందన్నారు. పళనిస్వామి అమెరికాకు ఆయన పాలనలో మంత్రులను తీసుకెళ్లాన్నారు. కానీ ఏ ఒప్పందాలూ చేసుకోలేదని గుర్తుచేశారు. తిరుచ్చి పంజపూర్ బస్టాండ్లో 500 బస్సులు నిలిపే వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి పక్కనే రూ.600 కోట్ల ఖర్చుతో ఐటీ పార్క్ రానుందన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో పరిశ్రమల కోసం ఒప్పందం కుదుర్చుకొని రెండులక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. బుధవారం సింగపూర్లో ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లారన్నారు. వారిపై ఆరోపణలు చేయడం మానేసి ఇప్పటివరకు రాష్ట్రానికి అన్నాడీఎంకే ఏం చేసిందో తిరిగి చూసుకోవాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు