బడులకు సెలవుల పొడిగింపు
వేసవి ఎండలు దృష్ట్యా పుదుచ్చేరిలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నమశివాయం తెలిపారు. పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.
విలేకర్లతో మాట్లాడుతున్న నమశివాయం
చెన్నై, న్యూస్టుడే: వేసవి ఎండలు దృష్ట్యా పుదుచ్చేరిలోని పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నమశివాయం తెలిపారు. పుదుచ్చేరి శాసనసభ ప్రాంగణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎండల తీవ్రత కారణంగా తమిళనాడు తరహాలో పుదుచ్చేరిలోనూ పాఠశాలల సెలవులను పొడించాలంటూ పలు వర్గాలు నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. ఆ మేరకు జూన్ 1కి బదులుగా 7న పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల్లో పాఠశాలలను తెరవనున్నట్టు తెలిపారు. నిబంధనలు సవరించి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికకు అనుమతించాలన్న తమ అభ్యర్థన ఆ మేరకు పుదుచ్చేరిలోని 127 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలుకు అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఆ పాఠ్యప్రణాళిక పుస్తకాలను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. తొలివిడతగా కారైకాల్, మాహే, యానాం ప్రాంతాలకు పాఠ్యపుస్తకాలను పంపగా పుదుచ్చేరిలో పాఠశాలలు తెరిచిన మొదటి రోజు అందిస్తామని పేర్కొన్నారు. ఉచిత యూనిఫారం, సైకిళ్లు అందిస్తున్న నేపథ్యంలో ఒకటిన్నర నెలలోపు ల్యాప్టాప్లూ అందించడానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో తమిళం ఐచ్ఛిక పాఠ్యాంశంగా ఉంటోందని పేర్కొన్నారు. రాష్ట్ర పాఠ్యప్రణాళికలో కొనసాగే ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. జాతీయ పరీక్షలైన నీట్, జేఈఈలో ఉత్తీర్ణత సాధించడానికి సీబీఎస్ఐ పాఠ్యప్రణాళిక తప్పనిసరి అవుతోందని, అందువల్లే ఆ పాఠ్యప్రణాళికకు ప్రభుత్వం మారుతోందని వెల్లడించారు. వెంట విద్యాశాఖ సంచాలకులు ప్రియదర్శిని, సంయుక్త సంచాలకులు శివకామి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!