logo

ఘనంగా గోవా అవతరణ దిన వేడుకలు

గోవా అవతరణ దినోత్సవ వేడుకలు పుదుచ్చేరిలోని రాజ్‌ నివాస్‌లో మంగళవారం జరిగాయి.

Updated : 31 May 2023 04:37 IST

పుస్తకాలు అందిస్తున్న తమిళిసై సౌందరరాజన్‌

చెన్నై, న్యూస్‌టుడే: గోవా అవతరణ దినోత్సవ వేడుకలు పుదుచ్చేరిలోని రాజ్‌ నివాస్‌లో మంగళవారం జరిగాయి. పుదుచ్చేరిలో వైద్య తదితర విద్యలను అభ్యసిస్తున్న గోవాకు చెందిన విద్యార్థుల బృందం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. గోవా సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా నృత్యాలు, కవితలు, గానాలాపన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వీక్షించి ఆస్వాదించారు. విద్యార్థులను సన్మానించి స్వామి వివేకానంద పుస్తకాలను అందించారు. వారిలో స్ఫూర్తిని నింపేలా ప్రసంగించారు.


విద్యార్థినుల బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని