logo

మోదీ పాలనపై ఇన్‌ఛార్జి ఎల్జీ ప్రసంగం

కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని 9ఏళ్ల పాలనపై తెలంగాణ గవర్నరు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నరైన తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు.

Published : 01 Jun 2023 00:20 IST

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న తమిళిసై సౌందరరాజన్‌

చెన్నై, న్యూస్‌టుడే: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని 9ఏళ్ల పాలనపై తెలంగాణ గవర్నరు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నరైన తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని పరిపాలన గురించి చెన్నైలోని ‘పొదిగై’ టీవీ చానెల్‌ వార్తా విభాగం తరఫున ‘9 అండుగళ్‌ సాధనై పయనం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రత్యేక అతిథిగా తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. ఆమెను వార్తా విభాగం సంచాలకులు గురుబాబు బలరామన్‌ శాలువతో సత్కరించారు. ప్రత్యక్ష కార్యక్రమంలో తమిళిసై పాల్గొని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, మోదీ పరిపాలన దక్షత గురించి ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని