logo

వైభవంగా రథోత్సవం

పుదుచ్చేరిలో జరిగిన రథోత్సవాన్ని ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. విల్లియనూర్‌లోని శ్రీకోకిలాంబిక సమేత శ్రీతిరుకామీశ్వరర్‌ ఆలయ రథోత్సవం గురువారం జరిగింది.

Published : 02 Jun 2023 00:59 IST

రథాన్ని లాగుతున్న తమిళిసై, రంగస్వామి, సెల్వం, నమశివాయం, జయకుమార్‌ తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో జరిగిన రథోత్సవాన్ని ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. విల్లియనూర్‌లోని శ్రీకోకిలాంబిక సమేత శ్రీతిరుకామీశ్వరర్‌ ఆలయ రథోత్సవం గురువారం జరిగింది. ఇందులో ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొని రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమిళిసైతో ముఖ్యమంత్రి రంగస్వామి, సభాపతి సెల్వం, మంత్రులు నమశివాయం, జయకుమార్‌, సాయి శరవణన్‌కుమార్‌, ప్రతిపక్షనేత శివ తదితరులు కూడా రథాన్ని లాగారు. తర్వాత స్వామిదర్శనం చేసుకున్నారు. విల్లియనూర్‌ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు