కళాశాల మారే విద్యార్థులకు ఉపశమనం
ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మారాలనుకునే విద్యార్థులకు వారు కట్టిన ఫీజు, బదిలీ ధ్రువపత్రం ఒకేసారి ఇవ్వాలని కళాశాలలకు తెలపాల్సిందిగా వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.
వడపళని, ప్యారిస్, న్యూస్టుడే: ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మారాలనుకునే విద్యార్థులకు వారు కట్టిన ఫీజు, బదిలీ ధ్రువపత్రం ఒకేసారి ఇవ్వాలని కళాశాలలకు తెలపాల్సిందిగా వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. బుధవారం వర్సిటీ ఉపకులపతులతో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి సమావేశమయ్యారు. మరో కళాశాలలో చేరాలనుకునే వారికి ప్రయివేటు కళాశాలలు వారు కట్టిన ఫీజు, టీసీలు ఇవ్వడం లేదని, అన్ని ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలు కట్టిన ఫీజు, టీసీ ఇవ్వాలని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి వర్సిటీలు సర్క్యులర్లు కూడా జారీ చేయాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం గురించి వర్సిటీ ఉపకులపతులతో గవర్నరు సమావేశం కావడం గురించి మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యా విధానం గురించి త్వరలోనే ప్రకటిస్తామని, విద్యా శాఖ కూడా దానికి అనుగుణంగానే నడుచుకోనుందని తెలిపారు. గవర్నరు నుంచి ఆహ్వానం అందిన తర్వాత సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనేది ఉపకులపతులే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. యూజీ, పీజీ కోర్సుల సిలబస్లో మార్పులు, ఫీజు, ఇతర విషయాలు, ‘నాన్ ముదల్వన్ కోర్సు’ అమలుపై చర్చించారు. అన్ని కళాశాలల్లో తమిళం, ఇంగ్లిషులో ఒకే రకమైన ప్రశ్నపత్రాలుండాలన్నారు. ఇతర సబ్జెక్టులకు కామన్గా 75 శాతం, స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా ఉన్న సబ్జెక్టు మీద 25 శాతంతో ప్రశ్నలుండాలని చెప్పారు. అందరికీ ఒకే విధమైన పరీక్ష టైం టేబుల్, ఒకే రోజు ఫలితాలు విడుదలవాలని సూచించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కార్తికేయన్, సాంకేతిక విద్యాశాఖ కమిషనరు టీజీ వినయ్, పలు వర్సిటీలకు చెందిన ఉపకులపతులు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్