నిరాడంబరంగా కరుణ శతజయంతి
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతిని శనివారం నిరాడంబరంగా నిర్వహించారు.
ఓమందూరర్ ప్రభుత్వ ఎస్టేట్లో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతిని శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. కరుణానిధి శతజయంతి సందర్భంగా మెరినా తీరంలోని అన్నాదురై, కరుణానిధి సమాధులకు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం నివాళులర్పించారు. ఓమందూరర్ ప్రభుత్వ ఎస్టేట్లోని కరుణానిధి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి అంజలి ఘటించారు. ఒడిశా రైలు దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపేలా శ్రద్ధాంజలి ఘటించారు. వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, రాష్ట్ర మంత్రులు, డీఎంకే ఎంపీలు, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ తదితరులు ఉన్నారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో, డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ కార్యాలయం ప్రాంగణంలో, డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం ప్రాంగణంలో, సీఐటీ నగర్లోని కనిమొళి నివాసంలో ఏర్పాటు చేసిన కరుణానిధి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వెంట డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్ బాలు, ఉప ప్రధానకార్యదర్శులు కేఎన్ నెహ్రూ, కనిమొళి తదితరులు ఉన్నారు.
‘ఆధునిక రాష్ట్ర శిల్పి’.. ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం చేసిన ట్వీట్లో... హేతువాదం, ఆత్మ గౌరవం భావజాలాలను కాపాడే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నాయకత్వం వహించిన నాయకుడు కరుణానిధి అన్నారు. అసంఖ్యాక సాంఘిక సంక్షేమ పథకాలతో నేటి ఆధునిక తమిళనాడును చెక్కిన శిల్పి అని కీర్తించారు. పార్టీ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయన మార్గంలో నడుద్దామంటూ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి