రాష్ట్ర ప్రయాణికులతో సంప్రదింపులు
కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికులతో మాట్లాడినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు.
వార్ రూంలో పరిస్థితిని సమీక్షిస్తున్న రామచంద్రన్
చెన్నై, న్యూస్టుడే: కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికులతో మాట్లాడినట్లు రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. ఒడిశాలో రైలు దుర్ఘటన నేపథ్యంలో ఎళిలగంలోని వార్ రూంలో పరిస్థితిని మంత్రి రామచంద్రన్ సమీక్షించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఒడిశాలో కోరమాండల్ రైలు ప్రమాద నేపథ్యంలో రాష్ట్ర భాష తెలిసిన ప్రభుత్వ అధికారులను దుర్ఘటన ప్రాంతానికి పంపినట్టు తెలిపారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే మృతుల్లో రాష్ట్రానికి చెందినవారి సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన వారుంటే మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రెండు రోజుల పాటు వార్ రూమ్లోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఘటనా స్థలి నుంచి 8 మంది వార్ రూమ్ను సంప్రదించారని, కోరమండల్ రైలులోని రాష్ట్రానికి చెందిన 127 మంది ప్రయాణికులతో ఇప్పటివరకు మాట్లాడినట్టు తెలిపారు. హౌరా రైలులోని ఐదుగురితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా