ప్రత్యేక ఎస్సై సస్పెన్షన్
చెంగల్పట్టు జిల్లా పౌంజూర్ సమీప ఎల్ఎల్ ఎండత్తూర్కు చెందిన శివబాలన్ 2018లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు.
భక్తవత్సలం
మహాబలిపురం, న్యూస్టుడే:. చెంగల్పట్టు జిల్లా పౌంజూర్ సమీప ఎల్ఎల్ ఎండత్తూర్కు చెందిన శివబాలన్ 2018లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందటంతో చిత్తామూర్ పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణ 2019లో ముగిసింది. తరువాత శివబాలన్ తన ద్విచక్ర వాహనాన్ని తీసుకోవడానికి చిత్తామూర్ పోలీసు స్టేషనకు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతనికి పాత నెంబరు ప్లేటు లేని ద్విచక్ర వాహనాన్ని అప్పగించారు. తన వాహనాన్ని పోలీసులు నెంబరు ప్లేటు మార్చి వాడుకుంటున్నట్లు శివబాలన్ గుర్తించాడు. దీంతో స్టేషనుకు వెళ్లి తన వాహనాన్ని ఇవ్వాలని, లేకుంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో పోలీసులు అతని వాహనంలోని కొత్త విడి భాగాలను తొలగించి పనికి రాని భాగాలు అమర్చి అప్పగించారు. ఆగ్రహించిన శివబాలన్ మళ్లీ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు జరిపి నివేదికను అందజేసింది. ప్రత్యేక సబ్ఇన్స్పెక్టరు భక్తవత్సలం శివబాలన్ ద్విచక్ర వాహనాన్ని నాలుగు ఏళ్లుగా వాడుకుంటున్నట్లు తెలియడంతో భక్తవత్సలాన్ని సస్పెండు చేస్తూ ఎస్పీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన ఎస్ఎస్ఐ మరో 10 రోజుల్లో పదవీ విరమణ పొందనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా