logo

పరాశక్తి రీరిలీజ్‌పై ప్రభు హర్షం

మూఢనమ్మకాలనే చీకట్లను చీల్చుకుంటూ కరుణానిధి కలం నుంచి జాలువారిన పదునైన మాటలతో తెరకెక్కిన చిత్రం ‘పరాశక్తి’. శివాజీ గణేశన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాత్మకంగా నిలిచింది.

Published : 05 Jun 2023 04:53 IST

ప్రభుకు శాలువా కప్పి సత్కరిస్తున్న కనిమొళి

కోడంబాక్కం, న్యూస్‌టుడే: మూఢనమ్మకాలనే చీకట్లను చీల్చుకుంటూ కరుణానిధి కలం నుంచి జాలువారిన పదునైన మాటలతో తెరకెక్కిన చిత్రం ‘పరాశక్తి’. శివాజీ గణేశన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాత్మకంగా నిలిచింది. 1952లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు కరుణానిధి శతజయంతి సందర్భంగా రీరిలీజ్‌ చేశారు. చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో శివాజీ గణేశన్‌ కుమారుడు, నటుడు ప్రభు, ఎంపీ కనిమొళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుకు డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ప్రభు మాట్లాడుతూ.. ‘పరాశక్తి చిత్రం మళ్లీ విడుదలవడం చాలా ఆనందంగా ఉంది. ఇందులోని మాటలు, నటించిన నాన్న ఇద్దరూ గొప్పవారే. ఈ చిత్రబృందాన్ని ఎప్పటికీ మరిచిపోలేమ’ని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని