దోపిడీదారుల్ని ప్రతిఘటించిన మహిళా కానిస్టేబుల్
మెరినా బీచ్లో ప్రేమికుల వద్ద దోపిడీకి యత్నించిన నలుగురిని ఓ మహిళా పోలీసు ఒంటరిగా ప్రతిఘటించారు. మెరినా తీరంలో ప్రజాపనులశాఖ కార్యాలయానికి ఎదురుగా ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు అక్కడి ఓ ప్రేమజంట వద్ద దోపిడీకి ప్రయత్నించారు.
కళ
చెన్నై, న్యూస్టుడే: మెరినా బీచ్లో ప్రేమికుల వద్ద దోపిడీకి యత్నించిన నలుగురిని ఓ మహిళా పోలీసు ఒంటరిగా ప్రతిఘటించారు. మెరినా తీరంలో ప్రజాపనులశాఖ కార్యాలయానికి ఎదురుగా ఆదివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు అక్కడి ఓ ప్రేమజంట వద్ద దోపిడీకి ప్రయత్నించారు. ప్రేమజంట నుంచి సెల్ఫోన్లు లాక్కోవడాన్ని దూరం నుంచి గమనించిన సాయుద దళం కానిస్టేబుల్ కళ హుటిహుటిన అక్కడికి చేరుకున్నారు. దోపిడీదారులను నిలువరించడానికి ప్రయత్నించగా కత్తితో పొడిచి చంపుతామంటూ బెదిరించారు. తనకు సాయంగా ఎవరూ రాకున్నా దోపిడీదారులను నిలువరించే ప్రయత్నం చేస్తూనే సెల్ఫోన్ ద్వారా అన్నా స్క్వేర్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి దోపిడీదారులు తప్పించుకున్నారు. ద్విచక్రవాహనాల నెంబర్లను కళ గుర్తు పెట్టుకున్నారు. ప్రేమజంట ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. నిందితులను వాల్టాక్స్ రోడ్డుకు చెందిన రౌడీషీటర్లు ఉదయకుమార్, తమిళరసన్, వసంతకుమార్, సోమసుందరంగా గుర్తించి అరెస్టు చేశారు. దోపిడీదారులను ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొన్న కానిస్టేబుల్ కళకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గవర్నర్ పదవి త్యజించడం మంచిదే: తమిళిసై
[ 28-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తోందని దక్షిణ చెన్నై భాజపా అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కోయంబేడు శివాలయం నుంచి బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. -
రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
[ 28-03-2024]
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. -
మెట్రో రెండోదశ మార్గంలో వసతుల కల్పనకు కసరత్తు
[ 28-03-2024]
మెట్రో రెండో దశ పనులు నగరంలో మూడు ప్రాంతాల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. ప్రయాణికులకు చక్కటి సేవలతో పాటు వసతుల కల్పనకు సీఎంఆర్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతోంది. -
తిరువణ్ణామలైలో విజయ పతాకమెవరిది?
[ 28-03-2024]
తిరువణ్ణామలై ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఇక్కడి ఉన్నాములై సమేత అరుణాచలేశ్వర్ ఆలయంలో ఉంది. ఆలయం సుమారు 1100 ఏళ్ల కిందట నిర్మితమైంది. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. -
చేజారిన సెంటిమెంట్ స్థానం
[ 28-03-2024]
దిండుక్కల్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్డీపీఐకు టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ అవకాశం ఇస్తారని నమ్ముతున్నా
[ 28-03-2024]
మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు మళ్లీ తనకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నట్లు డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నామపత్రాన్ని షెనాయ్నగర్లోని కార్పొరేషన్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించారు. -
నామినేషన్ దాఖలు చేసిన అన్నామలై
[ 28-03-2024]
భాజపా తరపున కోయంబత్తూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
వేరే చిహ్నంతో పోటీ: దురైవైగో
[ 28-03-2024]
బొంగరం గుర్తు దొరక్కపోతే వేరే చిహ్నంతో పోటీ చేస్తామని తిరుచ్చి ఎండీఎంకే అభ్యర్థి దురైవైగో అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. గుర్తు కేటాయింపున వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. -
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్
[ 28-03-2024]
దేవేంద్ర కుల వెల్లలార్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామని పీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వ్యవస్థాపకుడు రామదాస్ బుధవారం చెన్నై టీనగర్లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
పార్టీలు కొత్త గుర్తులతో పోటీ చేయాలి: సీమాన్
[ 28-03-2024]
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే)కి జాతీయ మృగమైన పులిని తమ ఎన్నికల గుర్తుగా కేటాయించాలని కోరనున్నామని ఆ పార్టీ చీఫ్ కన్వీనర్ సీమాన్ తెలిపారు. చెన్నై ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. -
చెన్నై సహా ఐదుచోట్ల ఎన్ఐఏ సోదాలు
[ 28-03-2024]
బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్