logo

మోక్ష దీపంతో మృతులకు నివాళి

ఒడిశా రైలు ప్రమాద మృతులకు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో మోక్ష దీపం వెలిగించి నివాళులర్పించారు.

Published : 05 Jun 2023 01:57 IST

ఆలయంలో మోక్ష దీపం వెలిగించిన అర్జున్‌ సంపత్‌

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: ఒడిశా రైలు ప్రమాద మృతులకు తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో మోక్ష దీపం వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో హిందూ ప్రజా పార్టీ అధ్యక్షుడు అర్జున్‌ సంపత్‌ పాల్గొని మోక్ష దీపం వెలిగించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరాజ్‌, కోయంబత్తూరుకు చెందిన సన్యాసులు పలువురు పాల్గొన్నారు.
అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం రైలు ప్రయాణికుల సంక్షేమ సంఘం తరఫున సంఘ అధ్యక్షుడు నైనా మాసిలామణి, ప్రధాన కార్యదర్శి గుణశీలన్‌, కోశాధికారి త్యాగరాజన్‌, సభ్యులు జశ్వంతరావ్‌, పాండియన్‌, లోకనాథన్‌ తదితరులు రైలు ప్రమాద మృతులకు అంజలి ఘటించారు.


అరక్కోణంలో అంజలి ఘటిస్తున్న దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని