అందుబాటులోకి 500 ఆరోగ్య కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 500 పట్ట ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వీసీ ద్వారా మంగళవారం ప్రారంభించారు. వైద్య, ప్రజా సంక్షేమ శాఖ తరఫున మంగళవారం సాయంత్రం తేనాంపేటలో ఉన్న వెల్ఫేర్ సెంటరులో ఈ కార్యక్రమం జరిగింది.
పట్టణ ఆరోగ్య కేంద్రాలను వీసీ ద్వారా ప్రారంభిస్తున్న స్టాలిన్
వేలచ్చేరి, న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 500 పట్ట ఆరోగ్య కేంద్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్ వీసీ ద్వారా మంగళవారం ప్రారంభించారు. వైద్య, ప్రజా సంక్షేమ శాఖ తరఫున మంగళవారం సాయంత్రం తేనాంపేటలో ఉన్న వెల్ఫేర్ సెంటరులో ఈ కార్యక్రమం జరిగింది. మొదటి దశలో రూ. 25 లక్షల చొప్పున కేటాయించి రూ. 125 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. 500 మంది వంతున వైద్యులు, నర్సులు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, శుభ్రతా కార్మికులను నియమించారు. ఉదయం 8 - మధ్యాహ్నం 12, సాయంత్రం 4 - రాత్రి 8 గంటల వరకు ఇవి పని చేస్తాయి. ఒక్కో సెంటరు పరిధిలో సుమారు 25 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రసూతి, శిశు వైద్య సేవలు, కుటుంబ నియంత్రణ, ఈఎన్టీ, దంత తదితర వైద్య చికిత్సలు అందిస్తారు. కార్యక్రమంలో మంత్రులు మా.సుబ్రమణియన్, ఉదయనిధి స్టాలిన్, చెన్నై మేయర్ ఆర్.ప్రియ, కమిషనరు జె.రాధాకృష్ణన్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గగన్ దీప్ సింగ్ బేడీ, ఎంపీలు దయానిధి మారన్, కళానిధి వీరాస్వామి, తమిళచ్చి తంగ పాండియన్ తదితరులు పాల్గొన్నారు.
జగదీష్ భగన్ రాష్ట్రానికి గర్వకారణం
ఇండియా సిమెంట్స్ ఎండీ ఎన్ శ్రీనివాసన్ తదితరులు...
వేలచ్చేరి, న్యూస్టుడే: యెనెస్కో అవార్డుకు ఎంపికైన జగదీష్ భగన్ను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసిస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. రామనాథపురం జిల్లా అటవీ శాఖ అధికారి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వుడు డైరెక్టరు జగదీష్ భగన్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ మేనేజ్ మెంటు అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అటవీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెరైన్ ఎలైట్ ఫోర్స్ వల్లనే సాధ్యమైందని ఆయన చెప్పడంతో గర్వ పడ్డాననన్నారు.
*ప్రభుత్వ అడిషనల్ ప్రధాన న్యాయవాది జె.రవీంద్రన్ మంగళవారం సీఎంను కలిశారు. చెన్నై అన్నా ఫైఓవర్ వద్ద ఆక్రమణల్లో ఉన్న ఉద్యానవన శాఖకు సొంతమైన రూ. 1000 కోట్ల విలువైన 115 ఎకరాల భూమిపై న్యాయపోరాటం జరిపి స్వాధీనం చేసుకొన్న సందర్భంగా చెన్నై సచివాలయంలో స్టాలిన్ను కలిసి ఆశీస్సులు పొందారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరైయన్బు, రెవెన్యూ, ప్రకృతి వైపరీత్యాల మేనేజ్మెంటు అడిషనల్ ప్రధాన కార్యదర్శి కుమార్ ఐసక్, ల్యాండ్ నిర్వాహక కమిషనరు నాగరాజన్ పాల్గొన్నారు.
*ఐపీఎల్ పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచిన కప్పును మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్కు ఇండియా సిమెంట్స్ ఎండీ, వైస్ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ప్రతినిధి రూపా గురునాథ్ చూపారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో న్యాయవాది జె.రవీంద్రన్ తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!