logo

11న చెన్నైకి అమిత్‌షా

 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా 11న చెన్నైకి రానున్నారు. ఆ రోజు ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి పళ్ళికరనై వెళ్లనున్నారు.

Published : 07 Jun 2023 00:59 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే:  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా 11న చెన్నైకి రానున్నారు. ఆ రోజు ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి పళ్ళికరనై వెళ్లనున్నారు. దక్షిణ చెన్నై పార్లమెంటు నియోజకవర్గ భాజపా నిర్వాహకులు, బాధ్యులతో సమావేశం కానున్నారు. ఈ నియోజకవర్గంలో భాజపా ఒంటరిగా పోటీ చేసి లక్ష ఓట్లు సాధించింది. దీంతో ఈ నియోజకవర్గంపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. రానున్న ఎన్నికల్లో ఈ స్థానం దక్కించుకునేందుకు నేతలు చేపట్టాల్సిన పనుల గురించి సలహాలు, సూచనలు అమిత్‌షా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చెన్నై పర్యటన ముగిసిన తరువాత వేలూర్‌లో జరగనున్న బహిరంగ సమావేశం పాల్గొననున్నారు. ముందుగా 8న అమిత్‌ షా తమిళనాడులో పర్యటిస్తారని ప్రకటించినా, తర్వాత 11వ తేదీకి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని