logo

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన సేలంలో చోటు చేసుకుంది.

Published : 07 Jun 2023 00:59 IST

ధ్వంసమైన కారు

సేలం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన సేలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...సేలం కల్పారపట్టికి చెందిన వెంకటాచలం (70). అతను తన భార్య మారియమ్మాళ్‌ (60), కుమార్తె పూంగొడి (27)తో కలిసి ఉత్తమచోళపురంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి మంగళవారం తిరిగి ద్విచక్ర వాహనంపై తమ ఇంటికి బయలుదేరారు. జాతీయ రహదారి వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొంది. మారియమ్మాళ్‌, పూంగొడిలు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ప్రాణాపాయ స్థితిలోనున్న వెంకటాచలాన్ని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని