logo

లబ్ధిదారులకు సంక్షేమ సాయం

రూ.50 లక్షల విలువైన సంక్షేమ సాయాన్ని మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బిల్‌ మహేష్‌ అందజేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ కార్యాలలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖ తరఫున కలెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ నేతృత్వంతో ఈ కార్యక్రమం బుధవారం జరిగింది. 

Published : 08 Jun 2023 00:10 IST

ద్విచక్ర వాహనాలను అందజేస్తున్న దృశ్యం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రూ.50 లక్షల విలువైన సంక్షేమ సాయాన్ని మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బిల్‌ మహేష్‌ అందజేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ కార్యాలలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖ తరఫున కలెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ నేతృత్వంతో ఈ కార్యక్రమం బుధవారం జరిగింది.  ద్విచక్ర వాహనాలను 60 మంది లబ్ధిదారులకు అందించారు. కలైజ్ఞర్‌ పట్టణాభివృద్ది పథకం కింద తిరుచ్చిలో చెత్తను తొలగించేందుకు రూ.47.19 లక్షల విలువైన వాహనాలను పంపిణీ చేశారు.  మంత్రి కేఎన్‌ నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ.... శుక్రవారం తంజావూర్‌ జిల్లాలోని డెల్టా ప్రాంతాల్లో  పూడికతీసే పనులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరిశీలించనున్నారని చెప్పారు. కూలైయూర్‌, నందియూరు  ప్రాంతాలలో పర్యటిస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని