సముద్ర సాహస యాత్ర ప్రారంభం
కారైక్కాల్కు చెందిన విద్యార్థులు బుధవారం సెయిలింగ్ బోట్లో పుదుచ్చేరికి సముద్ర సాహస యాత్రను చేపట్టారు. వచ్చే ఏడాది (2024)లో న్యూ ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్లో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నేషనల్ స్టూడెంట్స్ కార్ప్స్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు.
యాత్రను ప్రారంభిస్తున్న మంత్రి చంద్ర ప్రియాంక
వేలచ్చేరి, న్యూస్టుడే: కారైక్కాల్కు చెందిన విద్యార్థులు బుధవారం సెయిలింగ్ బోట్లో పుదుచ్చేరికి సముద్ర సాహస యాత్రను చేపట్టారు. వచ్చే ఏడాది (2024)లో న్యూ ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్లో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నేషనల్ స్టూడెంట్స్ కార్ప్స్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు స్టూడెంట్స్ కార్ప్స్ యూనిట్, పుదుచ్చేరి నేషనల్ స్టూడెంట్స్ కార్ప్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన పాఠశాల విద్యార్థుల కోసం సెయిలింగ్ బోట్ యాత్రను పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించారు. ఇందులో 25 మంది విద్యార్థినులతో సహా 60 మంది మంగళవారం సాయంత్రం కారైక్కాల్కు చేరుకొన్నారు. ఈ యాత్రలో లెఫ్టినెంట్ కమాండర్లు కె కీర్తి నిరంజన్, ఎస్ లోకేష్ ఇతర వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బుధవారం ఉదయం సెయిలింగ్ బోట్ సాహస యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుదుచ్చేరి, రవాణాశాఖ మంత్రి చంద్ర ప్రియాంక, కారైక్కాల్ కలెక్టరు కులోత్తుంగన్ జెండా ఊపి సముద్ర సాహస యాత్రను ప్రారంభించారు. యాత్రలో పాల్గొన్న వారిని మంత్రి శాలువలు కప్పి సత్కరించారు. కారైక్కాల్-పుదుచ్చేరి, మధ్య గల 302 కి.మీ. సముద్ర సాహస యాత్రలో పాల్గొనే వారు కొన్ని ప్రాంతాల్లో ఆగి రక్తదానం, బీచ్ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!