logo

మృత్యువులోనూ వీడని బంధం

చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ సమీప సెంబాక్కం పంచాయతీ అచ్చరవాక్కం గ్రామానికి చెందిన రామ్‌ (75) 2001-06 వరకు పంచాయతీ అధ్యక్షుడిగా పని చేశారు.

Published : 08 Jun 2023 00:09 IST

రామ్‌ , తంగమణి (పాత చిత్రం)

మహాబలిపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ సమీప సెంబాక్కం పంచాయతీ అచ్చరవాక్కం గ్రామానికి చెందిన రామ్‌ (75) 2001-06 వరకు పంచాయతీ అధ్యక్షుడిగా పని చేశారు. ఇతని భార్య తంగమణి (65). వీరికి పిల్లలు లేరు. రామ్‌ గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. సోమవారం చికిత్స పలించక రామ్‌ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు, రామ్‌ స్నేహితులు అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా, భర్త మృతిని తట్టుకోలేక తంగమణి గుండె పోటుకు గురైంది. ఆమెను చికిత్సకోసం కేళంబాక్కం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మంగళవారం సాయంత్రం మృతి చెందింది. వృద్థ దంపతులు ఒకరి వెంట ఒకరు మృతి చెందడంతో ఇద్దరు మృతదేహాలను మంగళవారం రాత్రి ఒకే వాహనంలో ఉంచి శ్మశానానికి తీసుకు వెళ్లి కుటుంబ సభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని