వందే భారత్ లోకో పైలట్లు సిద్ధం
వందే భారత్ రైళ్లను నడిపేందుకు మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలో రొటేషన్ పద్ధతిలో 248 మంది శిక్షణ పొందిన సిబ్బంది పని చేస్తున్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న 248 మంది
రైలు ముందు గార్డు
వందే భారత్ రైళ్లను నడిపేందుకు మంచి శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వేలో రొటేషన్ పద్ధతిలో 248 మంది శిక్షణ పొందిన సిబ్బంది పని చేస్తున్నారు.
న్యూస్టుడే, వడపళని దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - మైసూరు - డాక్టర్ ఎంజీఆర్ చెన్నై స్రెంటల్, చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు - చెన్నై, తిరువనంతపురం సెంట్రల్ - కాసర్గోడ్ - తిరువనంతపురం సెంట్రల్ ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మూడు మార్గాలకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. 160 కిలోమీటర్ల వేగంతో నడిచేందుకు, చెన్నై - అరక్కోణం సెక్షన్లలో 130 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. లోకో పైలట్లు చెన్నై ఐసీఎఫ్లో, ఘజియాబాద్ ఎలక్ట్రికల్ ట్రెయినింగ్ సెంటర్, ఆవడి జోనల్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రెయినింగ్ సెంటర్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.
క్యాబిన్లో వసతులు
- దక్షిణ రైల్వేలో ప్రస్తుతం 248 మంది లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు వందే భారత్ రైళ్లలో రొటేషన్ పద్ధతిలో పని చేస్తున్నారు.
- అన్ని రకాలుగా భద్రతతో నడిపేందుకు కావలసిన వసతులు లోకో పైలట్ క్యాబిన్లో ఉన్నాయి.
- పైలట్లకు బాగా కనిపించేందుకు వీలుగా ముందుగా అద్దాలతో కూడిన పెద్ద స్క్రీన్.
- లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లకు అధునాతన వసతులతో కూడిన కుర్చీలు.
- సిగ్నళ్లు మార్చుకునేందుకు కావలసిన సిగ్నల్ ఎక్ఛేంజ్ లార్పస్.
- లూప్లైన్ల వేగాన్ని నియంత్రిస్తూ తేలికగా నడిపేందుకు వీలుగా క్రూయిజ్ కంట్రోల్, హెచ్చరిక ప్రాంతాలు గుర్తిస్తూ, గరిష్ఠ వేగంతో నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు.
- క్యాబిన్ లోపల తిరిగేందుకు అనువైన స్థలం. ఏసీ సదుపాయం.
- ఓహెచ్ఈ కండిషన్ తెలుసుకునేందుకు వీలుగా వీడియో డిస్ప్లే.
- గార్డు, లోకో పైలట్కు మధ్య సమాచారం అందుకోవడానికి కావలసిన వ్యవస్థ వంటి సదుపాయాలు కల్పించారు.
లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపులోనే మహానగరం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావం నుంచి చెన్నై ఇప్పటికీ పూర్తిస్థాయిలో తేరుకోలేదు. కొన్ని ప్రాంతాలు వరద ఉద్ధృతి నుంచి బయటపడగా చాలాచోట్ల తగ్గలేదనే ఫిర్యాదులు పెద్దఎత్తున ప్రభుత్వ యంత్రాంగాలకు అందుతున్నాయి. -
ఆవిన్ పాలకు అవస్థలు
[ 07-12-2023]
చెన్నై, శివారులోని పలు ప్రాంతాల్లో ఆవిన్ పాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మంగళవారం పూర్తిగా సరఫరా లేకపోవడంతో టీ దుకాణాలు, హోటళ్లను ఆశ్రయించారు. బుధవారమైనా దొరుకుతాయని దుకాణాలకు వెళ్లిన స్థానికులకు నిరాశే ఎదురైంది. -
కదిలిస్తే కన్నీళ్లే..
[ 07-12-2023]
వరదలు చేదు అనుభవాలు మిగుల్చుతున్నాయి. నగరంలోని బాధిత ప్రాంతాల కష్టాలు తీరకపోవడంతో వివిధ మార్గాల్లో అధికారుల్ని సంప్రదించే పనులు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
[ 07-12-2023]
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేద్దామని ద్రావిడదేశం అధ్యక్షులు వి.కృష్ణారావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్ధంతిని ద్రావిడదేశం, వీసీకే పార్టీ మధ్య చెన్నై విభాగం సంయుక్తంగా బుధవారం నిర్వహించాయి. -
మరీ ఇంత దారుణమా?
[ 07-12-2023]
నటుడు విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తుపాను ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నటుడు విశాల్ వీడియో విడుదల చేశారు. -
వరద నీటిలో తీర ఆలయం
[ 07-12-2023]
భారీ వర్షాలకు చెంగల్పట్టు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వాసులను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో ఆహారం తయారు చేసి అందజేస్తున్నారు. -
కార్ల మరమ్మతుకు ఎంత ఖర్చయ్యేనో?
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చెన్నై జలమయమైంది. ఇళ్ల ముందు, పోర్టికోలు, రోడ్ల పక్కన నిలిపి ఉన్న కార్లు నీటిలో మునిగి ఉండటంతో వాటి మరమ్మతులకు ఎంత ఖర్చు చేయాలోనని యజమానులు తలపట్టుకొంటున్నారు. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
[ 07-12-2023]
మిగ్జాం తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
తక్షణసాయం అందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను నష్టాన్ని పూడ్చడానికి తక్షణసాయంగా రూ.5,060 కోట్లు అందించాలంటూ ప్రధానిని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి లేఖ రాశారు. అందులో... తుపాను కారణంగా 2, 3, 4 తేదిల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీవర్షం కురిసిందన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం