నీట్తో ప్రయోజనం శూన్యం
నీట్ అనే బలిపీఠంతో కేంద్రంలోని భాజపా సర్కార్ విద్యార్థుల ప్రాణాలు బలిగొంటోందని, ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టులో...
సీఎం స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: నీట్ అనే బలిపీఠంతో కేంద్రంలోని భాజపా సర్కార్ విద్యార్థుల ప్రాణాలు బలిగొంటోందని, ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన చేసిన పోస్టులో... నీట్ ఫలితం ఏమిటంటే ‘జీరో’ అని కేంద్రంలోని భాజపా సర్కారే అంగీకరించిందన్నారు. పీజీ వైద్య కోర్సులకు అర్హతా మార్కులను ఎత్తివేయడం ద్వారా నీట్లోని ఎలిజిబిలిటీకి అర్థం లేదని అంగీకరించిందని తెలిపారు. శిక్షణా కేంద్రాల్లో చేరండి, నీట్ పరీక్షలకు డబ్బు చెల్లించండి చాలనే పరిస్థితి కల్పించిందని పేర్కొన్నారు. నీట్ అంటే ‘సున్నా’ అయ్యిందని, దీనినే సంవత్సరాలుగా చెబుతున్నామని తెలిపారు. నీట్ కారణంగా ఎన్నో ప్రాణాలు బలైన తర్వాత ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. నీట్ అనే బలిపీఠంతో ప్రాణాలు బలిగొంటున్న ఈ భాజపా సర్కారును గద్దె దించాలని కోరారు.
రోడ్డు పనులపై నివేదిక సమర్పించాలని ఆదేశం
రామ్నగర్లోని ఓ రోడ్డులో పనులు పరిశీలిస్తున్న సీఎం
చెన్నై, న్యూస్టుడే: రోడ్డు పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని రామ్నగర్ 7వ క్రాస్ వీధి, మూడో మెయిన్ రోడ్డు పశ్చిమ భాగం, తూర్పు భాగం తదితర ప్రాంతాల్లో రూ.85 లక్షల వ్యయంతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం పరిశీలించారు. రహదారులశాఖ తరఫున మణపాక్కం-కొళపాక్కం-కిరుగంపాక్కం రోడ్డులో రూ.4.05 కోట్ల వ్యయంతో, రామాపురం-తిరువళ్లూరు రోడ్డులో రూ.2.23 కోట్ల వ్యయంతో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల పురోభివృద్ధిపై ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. చెన్నై మెట్రో రైలు పనులను ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేపట్టాలని, ఆ పనులను సకాలంలో ముగించాలని అధికారులకు ఆదేశించారు. వెంట మంత్రులు కేఎన్ నెహ్రూ, అన్బరసన్, సుబ్రమణియన్, మేయర్ ప్రియ, ఎమ్మెల్యేలు అరవింద్ రమేశ్, గణపతి, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్దాస్ మీనా, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనరు డాక్టర్ జె.రాధాకృష్ణన్ తదితరులు ఉన్నారు.
అధికారులతో సమీక్ష
సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి
చెన్నై, న్యూస్టుడే: నగరంలో మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని రోడ్డు పునరుద్ధరణ పనుల గురించి ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మంత్రి కేఎన్ నెహ్రూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్దాస్ మీనా, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనరు డాక్టర్ జె.రాధాకృష్ణన్, రహదారులు, చిన్న ఓడరేవులశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్ యాదవ్, చెన్నై మెట్రో రైలు లిమిటెడ్ ఎండీ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపులోనే మహానగరం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావం నుంచి చెన్నై ఇప్పటికీ పూర్తిస్థాయిలో తేరుకోలేదు. కొన్ని ప్రాంతాలు వరద ఉద్ధృతి నుంచి బయటపడగా చాలాచోట్ల తగ్గలేదనే ఫిర్యాదులు పెద్దఎత్తున ప్రభుత్వ యంత్రాంగాలకు అందుతున్నాయి. -
ఆవిన్ పాలకు అవస్థలు
[ 07-12-2023]
చెన్నై, శివారులోని పలు ప్రాంతాల్లో ఆవిన్ పాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మంగళవారం పూర్తిగా సరఫరా లేకపోవడంతో టీ దుకాణాలు, హోటళ్లను ఆశ్రయించారు. బుధవారమైనా దొరుకుతాయని దుకాణాలకు వెళ్లిన స్థానికులకు నిరాశే ఎదురైంది. -
కదిలిస్తే కన్నీళ్లే..
[ 07-12-2023]
వరదలు చేదు అనుభవాలు మిగుల్చుతున్నాయి. నగరంలోని బాధిత ప్రాంతాల కష్టాలు తీరకపోవడంతో వివిధ మార్గాల్లో అధికారుల్ని సంప్రదించే పనులు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
[ 07-12-2023]
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేద్దామని ద్రావిడదేశం అధ్యక్షులు వి.కృష్ణారావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్ధంతిని ద్రావిడదేశం, వీసీకే పార్టీ మధ్య చెన్నై విభాగం సంయుక్తంగా బుధవారం నిర్వహించాయి. -
మరీ ఇంత దారుణమా?
[ 07-12-2023]
నటుడు విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తుపాను ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నటుడు విశాల్ వీడియో విడుదల చేశారు. -
వరద నీటిలో తీర ఆలయం
[ 07-12-2023]
భారీ వర్షాలకు చెంగల్పట్టు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వాసులను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో ఆహారం తయారు చేసి అందజేస్తున్నారు. -
కార్ల మరమ్మతుకు ఎంత ఖర్చయ్యేనో?
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చెన్నై జలమయమైంది. ఇళ్ల ముందు, పోర్టికోలు, రోడ్ల పక్కన నిలిపి ఉన్న కార్లు నీటిలో మునిగి ఉండటంతో వాటి మరమ్మతులకు ఎంత ఖర్చు చేయాలోనని యజమానులు తలపట్టుకొంటున్నారు. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
[ 07-12-2023]
మిగ్జాం తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
తక్షణసాయం అందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను నష్టాన్ని పూడ్చడానికి తక్షణసాయంగా రూ.5,060 కోట్లు అందించాలంటూ ప్రధానిని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి లేఖ రాశారు. అందులో... తుపాను కారణంగా 2, 3, 4 తేదిల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీవర్షం కురిసిందన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Telangana Ministers: మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం