ఫైనాన్స్ కంపెనీ రూ.300 కోట్ల మోసం
తంజావూర్ జిల్లా కుంభకోణంలో అర్జున్కార్తిక్ అనే వ్యక్తి ‘శ్రీసాయి క్రిప్టో కన్సల్టెన్సీ’ పేరిట ఓ కంపెనీని 2021 నుంచి నడుపుతున్నాడు.
పోలీసులకు బాధితుల ఫిర్యాదు
ఆర్కేనగర్, న్యూస్టుడే: తంజావూర్ జిల్లా కుంభకోణంలో అర్జున్కార్తిక్ అనే వ్యక్తి ‘శ్రీసాయి క్రిప్టో కన్సల్టెన్సీ’ పేరిట ఓ కంపెనీని 2021 నుంచి నడుపుతున్నాడు. దీని శాఖలు తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, కడలూర్లలో ఉన్నాయి. ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెడితే 18 నెలల్లో రూ.15 వేలు వడ్డి ఇస్తామని, దీంతోపాటు బంగారు నాణెం అందిస్తామని ప్రకటించారు. దీంతో ప్రజలు పెట్టుబడి పెట్టారు. తర్వాత వడ్డీ ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల మీద మొత్తం రూ.300 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ బాధితులు కొందరు గురువారం తిరుచ్చి ఐజీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపులోనే మహానగరం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావం నుంచి చెన్నై ఇప్పటికీ పూర్తిస్థాయిలో తేరుకోలేదు. కొన్ని ప్రాంతాలు వరద ఉద్ధృతి నుంచి బయటపడగా చాలాచోట్ల తగ్గలేదనే ఫిర్యాదులు పెద్దఎత్తున ప్రభుత్వ యంత్రాంగాలకు అందుతున్నాయి. -
ఆవిన్ పాలకు అవస్థలు
[ 07-12-2023]
చెన్నై, శివారులోని పలు ప్రాంతాల్లో ఆవిన్ పాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మంగళవారం పూర్తిగా సరఫరా లేకపోవడంతో టీ దుకాణాలు, హోటళ్లను ఆశ్రయించారు. బుధవారమైనా దొరుకుతాయని దుకాణాలకు వెళ్లిన స్థానికులకు నిరాశే ఎదురైంది. -
కదిలిస్తే కన్నీళ్లే..
[ 07-12-2023]
వరదలు చేదు అనుభవాలు మిగుల్చుతున్నాయి. నగరంలోని బాధిత ప్రాంతాల కష్టాలు తీరకపోవడంతో వివిధ మార్గాల్లో అధికారుల్ని సంప్రదించే పనులు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
[ 07-12-2023]
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేద్దామని ద్రావిడదేశం అధ్యక్షులు వి.కృష్ణారావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్ధంతిని ద్రావిడదేశం, వీసీకే పార్టీ మధ్య చెన్నై విభాగం సంయుక్తంగా బుధవారం నిర్వహించాయి. -
మరీ ఇంత దారుణమా?
[ 07-12-2023]
నటుడు విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తుపాను ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నటుడు విశాల్ వీడియో విడుదల చేశారు. -
వరద నీటిలో తీర ఆలయం
[ 07-12-2023]
భారీ వర్షాలకు చెంగల్పట్టు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వాసులను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో ఆహారం తయారు చేసి అందజేస్తున్నారు. -
కార్ల మరమ్మతుకు ఎంత ఖర్చయ్యేనో?
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చెన్నై జలమయమైంది. ఇళ్ల ముందు, పోర్టికోలు, రోడ్ల పక్కన నిలిపి ఉన్న కార్లు నీటిలో మునిగి ఉండటంతో వాటి మరమ్మతులకు ఎంత ఖర్చు చేయాలోనని యజమానులు తలపట్టుకొంటున్నారు. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
[ 07-12-2023]
మిగ్జాం తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
తక్షణసాయం అందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను నష్టాన్ని పూడ్చడానికి తక్షణసాయంగా రూ.5,060 కోట్లు అందించాలంటూ ప్రధానిని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి లేఖ రాశారు. అందులో... తుపాను కారణంగా 2, 3, 4 తేదిల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీవర్షం కురిసిందన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: తెలంగాణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం