Andhra News: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. నివేదికలు రాగానే పూర్తి స్థాయి విచారణ: ఏపీ డీజీపీ
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు చేశామని.. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. వైద్య నివేదికలు రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు.
తిరుపతి: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు చేశామని.. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. వైద్య నివేదికలు రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు. తిరుపతిలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు, హత్యలు, గృహహింసలపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల స్పందన సరిగా లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉమ్మడి చిత్తూరు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులను త్వరలో పునరుద్ధరణ చేస్తామని.. నిషేధిత వస్తువులను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలకు పాల్పడితే ఎలాంటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
రాష్ట్రంలో సైబర్ క్రైం ఆదోళనకరంగా ఏమీ లేదని.. అయినప్పటికీ సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గిందన్నారు. ఆ సమయంలో నమోదైన క్రైం రేట్ను పోలీసు శాఖ ప్రామాణికంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి నారాయణ కేసులో ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా సంస్థలు సహకరిస్తే ఫేక్ న్యూస్ల వ్యాప్తిని సులభంగా నియంత్రించవచ్చని డీజీపీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’