విద్యుదాఘాతంతో కౌలురైతు మృతి
పంపుసెట్ ఆన్ చేసేందుకు వెళ్లిన యువరైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన శనివారం నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డిపాళెం గ్రామంలో జరిగింది. కొండారి సురేష్ (30) గ్రామ పరిధిలో నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు.
కొండారి సురేష్
నాయుడుపేట, న్యూస్టుడే: పంపుసెట్ ఆన్ చేసేందుకు వెళ్లిన యువరైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన శనివారం నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డిపాళెం గ్రామంలో జరిగింది. కొండారి సురేష్ (30) గ్రామ పరిధిలో నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో వరి పైరుకు నీరుపెట్టేందుకు పంపుసెట్టు వద్దకు వెళ్లారు. స్విచ్ ఆన్చేసే సమయంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయారు. సమీప రైతులు గుర్తించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు చేయగా అప్పటికి ఆయన మృతిచెందారు. ఎస్సై కృష్ణారెడ్డి ఘటనా స్థలం పరిశీలించి మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్త్ సమస్యతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సురేష్కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా