logo

Crime: ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి

ముగ్గురు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద పరిస్థితిలో మృతిచెందిన విషాద ఘటన అరకులోయలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Updated : 17 Jul 2021 07:35 IST


మృతి చెందిన చిన్నారి సుశాన

అరకులోయ, న్యూస్‌టుడే: ముగ్గురు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద పరిస్థితిలో మృతిచెందిన విషాద ఘటన అరకులోయలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

* స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అరకులోయ మండలం సిమిలిగుడకు చెందిన శెట్టి సంజీవ్‌ గిరిజన సహకార సంస్థలో ఒప్పంద సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సురేఖ (28)... కుమార్తె సుశాన (9), కుమారులు షర్విన్‌ (6), సిరిల్‌ (4) ఉన్నారు. కుటుంబంతో సహా సంజీవ్‌ అరకులోయలోని ‘సి’ కాలనీలో నివాసం ఉంటున్నారు.

* కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతూ స్థానికులకు కనిపించింది. అదే సమయంలో ముగ్గురు పిల్లలు విగత జీవులై మంచంమీద పడి ఉన్నారు. తన భార్య సురేఖ ముగ్గురు పిల్లలకు విషం పెట్టి... తాను ఉరి వేసుకుందని సంజీవ్‌ చెబుతున్నారు. తండ్రి లక్ష్మయ్య మాత్రం తన అల్లుడే కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలను చంపి... భార్యకు ఉరి వేసి చంపేశాడని ఆరోపిస్తున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రానికి తరలించారు. అరకులోయ ఎస్‌.ఐ. షేక్‌ నజీర్‌ ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాల గొడవలతో అరకులోయ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి ఉద్విగ్న వాతావరణం నెలకొంది.


విగతజీవులై ఉన్న ఇద్దరు చిన్నారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని