logo

కొవిడ్‌తో యువతి.. మనస్తాపంతో ప్రియుడు

తాను ఎంతో ఇష్టపడిన అమ్మాయి కొవిడ్‌ బారిన పడి మూడు రోజుల క్రితం గుంటూరులో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక గాజువాకకు చెందిన యువకుడొకరు బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌ తెలిపిన వివరాల మేరకు..

Published : 22 Jul 2021 07:34 IST

రోహిత్‌కుమార్‌ (పాత చిత్రం)

గాజువాక, న్యూస్‌టుడే : తాను ఎంతో ఇష్టపడిన అమ్మాయి కొవిడ్‌ బారిన పడి మూడు రోజుల క్రితం గుంటూరులో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక గాజువాకకు చెందిన యువకుడొకరు బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌ తెలిపిన వివరాల మేరకు... పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్‌(25) ఇంటర్‌ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్‌లో ఆన్‌లైన్‌ పార్శిల్‌ సర్వీసు పని చేస్తున్నాడు. ఆరుగురు మిత్రులతో కలిసి కణితిరోడ్డులో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్‌ సర్వీసు కొనసాగించాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కడే నివాస గదికి చేరుకుని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన మిత్రులు రోహిత్‌ మృతదేహాన్ని చూసి... వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనకాపల్లికి చెందిన యువతి గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని బాధ పడేవాడని, మరో సంబంధం చూసి వివాహం చేస్తామని నచ్చజెప్పామని తండ్రి కృష్ణారావు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంతలోనే ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని వాపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని