logo

ఆరు నెలల బాలుడి అపహరణ

విశాఖ మన్యంలో ఆరు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌ జిల్లా దేవరి గ్రామానికి చెందిన

Published : 05 Dec 2021 05:36 IST

విలపిస్తున్న బాలుడి తల్లిదండ్రులు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: విశాఖ మన్యంలో ఆరు నెలల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌ జిల్లా దేవరి గ్రామానికి చెందిన సూరజ్‌లువార్‌, జ్యోతి దంపతులు కుటుంబసభ్యులతో కలిసి వారం రోజుల క్రితం అరుకు సంతబయలులో పరికరాల తయారీ, విక్రయానికి వచ్చారు. గురువారం పని అనంతరం రాత్రి అక్కడే గుడారాల్లో నిద్రించారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో బాలుడిని ఎవరో తీసుకెళ్లిపోయారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆచూకీ తెలిస్తే 94409 04223 నంబరుకు సమాచారం అందించాలని కోరారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని