logo

ప్రముఖ చిత్రకారుడు ఎర్రాజీరావు కన్నుమూత

నాలుగు దశాబ్దాలకు పైగా తన చిత్రాలతో దేశ, విదేశీయుల ప్రశంసలు పొందిన సీనియర్‌ చిత్రకారుడు, ఉదయ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ అధినేత ఉమ్మిడి ఎర్రాజీరావు(59) మృతి చెందారు. అనారోగ్యం కారణంగా మనోరమ థియేటర్‌

Published : 06 Dec 2021 02:14 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నాలుగు దశాబ్దాలకు పైగా తన చిత్రాలతో దేశ, విదేశీయుల ప్రశంసలు పొందిన సీనియర్‌ చిత్రకారుడు, ఉదయ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ అధినేత ఉమ్మిడి ఎర్రాజీరావు(59) మృతి చెందారు. అనారోగ్యం కారణంగా మనోరమ థియేటర్‌ వద్ద గల నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కళాకారులు వసుపల్లి చిన్ని, జి.సూర్యనారాయణ, ఎం.మురళీకృష్ణ, సురేష్‌బాబు, చెన్నాతిరుమల రావు తదితరులు ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సాయంత్రం జ్ఞానాపురం హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని