logo

పీహెచ్‌సీ ఉద్యోగిని కడుపునొప్పితో మృతి

కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుజనకోట ఆరోగ్య ఉప కేంద్రంలో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తున్న విల్లూరి కీర్తి(28) తీవ్రమైన కడుపునొప్పితో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈనెల 2న ఆమె

Published : 06 Dec 2021 02:14 IST

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: కిలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుజనకోట ఆరోగ్య ఉప కేంద్రంలో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తున్న విల్లూరి కీర్తి(28) తీవ్రమైన కడుపునొప్పితో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈనెల 2న ఆమె విధులు ముగించుకుని పెదబయలులోని తన ఇంటికి వెళ్లారని, తీవ్రమైన కడుపునొప్పితో పాటు రక్తస్రావం జరిగిందని పీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు. ఈ నెల 3న మళ్లీ కడుపునొప్పి, రక్తస్రావం జరగటంతో పెదబయలులోని పీహెచ్‌సీకి తరలించామని, అక్కడి నుంచి పాడేరులోని జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారని చెప్పారు. మృతదేహాన్ని గాజువాక పరిధిలోని తోకాడలో వారి స్వగృహానికి తరలించామని వైద్యులు విశ్వేశ్వరనాయుడు, సాయికిరణ్‌  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని