logo

992 కేజీల గంజాయి స్వాధీనం

ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. విశాఖపట్టణం నుంచి

Published : 06 Dec 2021 02:14 IST

సంగారెడ్డి అర్బన్‌, నూస్‌టుడే: ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంతోష్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు సంగారెడ్డి మీదుగా లారీలో గంజాయిని తరలిస్తుండగా సదాశివపేట బైపాస్‌ రోడ్డులో ఆదివారం రాత్రి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు లారీని తనిఖీ చేసి 992 కిలోల ఎండు గంజాయిని, లారీని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.99 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. నిందితుల పూర్తి వివరాలు సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని