logo

‘పైపులైన్‌ తొలగించకుంటే ఉరే శరణ్యం’

హెటిరో మందుల పరిశ్రమ యాజమాన్యం కంపెనీ నుంచి సముద్రంలోకి వేస్తున్న పైపులైన్‌ను తొలగించకపోతే తమకు ఉరే శరణ్యమని మత్స్యకార నాయకులు అన్నారు. రాజయ్యపేట-దొండవాక మార్గంలో వీరంతా

Published : 06 Dec 2021 02:14 IST

మెడకు ఉరితాడుతో మత్స్యకారుల నిరసన

నక్కపల్లి, న్యూస్‌టుడే: హెటిరో మందుల పరిశ్రమ యాజమాన్యం కంపెనీ నుంచి సముద్రంలోకి వేస్తున్న పైపులైన్‌ను తొలగించకపోతే తమకు ఉరే శరణ్యమని మత్స్యకార నాయకులు అన్నారు. రాజయ్యపేట-దొండవాక మార్గంలో వీరంతా చేపడుతున్న శాంతియుత ధర్నా అయిదో రోజుకు చేరింది. ఆ మేరకు నిరసనకారులు ఆదివారం మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సోమవారం భారీ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కంబాల అమ్మోరియ్య, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, అప్పలరాజు, కొర్లయ్య, నాగేశ్‌, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు