సగంపైగా దాచేశారు!
జిల్లాలో కరోనా కల్లోలం గతేడాది మేలో మొదలైంది. మొదటిదశలో వైరస్ బారిన పడిన వారు వేలల్లో ఉంటే, మరణించిన వారు వందల్లో ఉన్నారు. రెండోదశకు వచ్చేసరికి విజృంభణ పతాక స్థాయికి చేరుకుంది. వైరస్
కొవిడ్ మృతుల లెక్కల్లో గిమ్మిక్కు
జిల్లాలో కరోనా కల్లోలం గతేడాది మేలో మొదలైంది. మొదటిదశలో వైరస్ బారిన పడిన వారు వేలల్లో ఉంటే, మరణించిన వారు వందల్లో ఉన్నారు. రెండోదశకు వచ్చేసరికి విజృంభణ పతాక స్థాయికి చేరుకుంది. వైరస్ బాధితులు లక్ష దాటిపోగా మృతులు వేల సంఖ్యలో ఉన్నారు. రోజుకు 20 నుంచి 30 మంది వరకు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ అధికారిక లెక్కల్లో చూపించలేదు.
కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా నాలుగైదు మరణాలే చూపించేవారు. దీంతో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కనిపించేది. అయితే కొవిడ్తో చనిపోయిన వారికి ప్రభుత్వమిచ్చే ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను చూస్తే ఈ వైరస్కు ఎంతమంది బలైపోయారో అర్థమవుతోంది. అధికారికంగా గుర్తించిన మరణాల కంటే రెట్టింపు దరఖాస్తులు రావడంతో కొవిడ్ సృష్టించిన మారణకాండ వెలుగులోకి వచ్చినట్లయింది.
ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా జిల్లాలో 1,103 మంది చనిపోయినట్లు అధికారికంగా గుర్తించారు. గతేడాది మే నుంచి డిసెంబర్ వరకు 523 మంది చనిపోగా ఈ ఏడాది మే నుంచి జులై మధ్యలో 500 మంది వరకు మరణించినట్లు దస్త్రాల్లో చూపించారు. రెండోదశలో ఆక్సిజన్ అందక, ఆసుపత్రిలో పడకలు దొరక్క కుటుంబసభ్యుల కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. వీరిలో చాలామంది వైద్యారోగ్య శాఖ దస్త్రాల్లో నమోదు కాలేదు. దీంతో కరోనా వల్ల చనిపోయిన వారి వివరాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు. తాజాగా ప్రభుత్వం కొవిడ్ మృతుల కుటుంబాలకు ఇచ్చే రూ.50 వేల ఆర్థిక సాయానికి 2,500పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 1,996 దరఖాస్తులకు పరిహారం కోసం సిఫార్సు చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. వీటినిబట్టి చూస్తే ప్రభుత్వ లెక్కల్లో చూపిన మరణాల కంటే అదనంగా 1400 మంది కొవిడ్తో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంత స్థాయిలో మరణాల లెక్క ఎక్కడ తప్పిందని సంబంధిత శాఖలోనే చర్చనీయాంశమవుతోంది.
మరణాల లెక్కలు తప్పాయిలా..
రెండోదశలో కొవిడ్ తీవ్రస్థాయికి వెళ్లిపోవడం, ఎక్కువ మంది ఆక్సిజన్ అందక చనిపోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారిలో భయం పోగొట్టడానికి కొవిడ్ మరణాలను తగ్గించి చూపించారనే వాదన వినిపిస్తోంది. అలాగే కొవిడ్తో చనిపోయారని తెలిస్తే చిన్నచూపు చూస్తారని కుటుంబ సభ్యులు కూడా కొన్ని మరణాల వివరాలను బయటకు వెల్లడించలేదు. ఇప్పుడు ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత కొవిడ్ మృతుల కుటుంబాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చి చనిపోయినట్లు ఆధారముంటే చాలు అలాంటి వారందరికీ పరిహారం ఇవ్వాలని సూచించింది. దీంతో ఇళ్లల్లో, ప్రైవేటు క్లినిక్లలో వైద్యం పొంది చనిపోయిన వారి కుటుంబాలు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులన్నింటినీ నిశితంగా పరిశీలించే పరిహారం కోసం ప్రతిపాదిస్తున్నామని డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాకు రూ.6.63 కోట్ల సాయం వచ్చిందని, ఆ మొత్తం బాధితుల నామినీ ఖాతాలకు జమవుతున్నాయన్నారు.
* అత్యధికంగా గోపాలపట్నంనుంచి 308 మంది కొవిడ్ సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. తరువాత గాజువాక నుంచి 204, విశాఖ గ్రామీణ మండలం నుంచి 180, సీతమ్మధార నుంచి 174, మహరాణిపేట నుంచి 148 మంది మృతుల కుటుంబసభ్యులు దరఖాస్తు చేశారు.
* గ్రామీణంలో అనకాపల్లి నుంచి అత్యధికంగా 135 మంది దరఖాస్తు చేయగా, నర్సీపట్నం నుంచి 50 మంది, ఎలమంచిలి, కె.కోటపాడు నుంచి 31 మంది చొప్పున దరఖాస్తు చేశారు.
* డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పాయకరావుపేట, జి.మాడుగుల, హుకుంపేట, అచ్యుతాపురం, కోటవురట్ల మండలాల్లో కొవిడ్ మృతులున్నా ఒక్క దరఖాస్తు కూడా డీఎంహెచ్వో కార్యాలయానికి పరిశీలనకు రాకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా