అపరెల్.. ఆపసోపాల్..!
ఆటోనగర్ అపరెల్ పార్కులో కొవిడ్కు ముందు వస్త్రాల క్రయ, విక్రయాలు జోరుగా సాగడంతో మహిళలకు ఉపాధి అవకాశాలు బాగానే ఉండేవి. ఇతర జిల్లాలతో పాటు, రాష్ట్రాల నుంచి వస్త్రాల ఆర్డర్లు రావడం, సకాలంలో
కొవిడ్ తర్వాత తగ్గిన క్రయ విక్రయాలు, ఉపాధి అవకాశాలు
న్యూస్టుడే, ఆటోనగర్
ఆటోనగర్ అపరెల్ పార్కు వస్త్ర పరిశ్రమ కుట్టు పనిలో మహిళలు
ఆటోనగర్ అపరెల్ పార్కులో కొవిడ్కు ముందు వస్త్రాల క్రయ, విక్రయాలు జోరుగా సాగడంతో మహిళలకు ఉపాధి అవకాశాలు బాగానే ఉండేవి. ఇతర జిల్లాలతో పాటు, రాష్ట్రాల నుంచి వస్త్రాల ఆర్డర్లు రావడం, సకాలంలో వాటిని సిద్ధం చేసి ఇవ్వడం.. అంతా సజావుగానే సాగేది. కొవిడ్ తర్వాత ముడిసరకు కొనుగోలు నుంచి పని చేసే కార్మికుల వరకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయని... నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
ఆటోనగర్లో 146 ఎకరాల స్థలానికి లే-అవుట్ చేసి అపరెల్పార్కు పేరుతో 2006 ఏడాదిలో ప్రత్యేక బ్లాకు ఏర్పాటు చేశారు. అప్పట్లోనే 75 ప్లాట్లను వస్త్ర పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. మొదట్లో 40 వరకు పరిశ్రమలు ప్రారంభించినా... ప్రస్తుతం ఏడెనిమిది మాత్రమే నడుస్తున్నాయి. వాటిల్లో వందలాది మంది మహిళలు ఉపాధి పొందుతుండగా, అన్నీ అందుబాటులోకి వస్తే వేలల్లో ఉపాధి అవకాశాలు దక్కుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* కొందరు యజమానులు అసలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఆయా స్థలాలు నేటికీ ఖాళీగానే ఉన్నాయి. కొన్ని స్థలాల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇతర తరహా పరిశ్రమలు కొలువుదీరాయి.
* అయితే బ్లాక్ ఏర్పాటు చేసినప్పుడు ప్రకటించిన రాయితీలు... ఆ తర్వాత అందుబాటులో లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక ఏళ్ల నుంచి అరకొర లాభాలతో పరిశ్రమలను నెట్టుకొస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
ముడిసరకు - ఆర్డర్లు
ఇక్కడ కుట్టు పరిశ్రమలు నిర్వహించే వారంతా యువతీ, యువకుల దుస్తులకు సంబంధించి, కిటికీలు- తలుపుల కర్టెన్స్కు, చిన్నపిల్లల వస్త్రాల తయారీకి, బెడ్షీట్స్- దిండ్లుకు సంబంధించిన మెటీరియల్స్ను ముంబయి, సూరత్, అహ్మదాబాద్, కోల్కతా నుంచి దిగుమతి చేసుకుంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ఇతర సంస్థల నుంచి రెడీమేడ్ వస్త్రాలనూ ఆర్డర్లపై తెచ్చుకుని... ఇక్కడ విక్రయిస్తుంటారు.
* అపెరల్ పార్కులోని కుట్టు కేంద్రాలకు విశాఖ నగరంతో పాటు, అనకాపల్లి, విజయనగరం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రదేశాల నుంచి వస్త్రాలు కుట్టే ఆర్డర్లు వస్తుంటాయి. ఆయా పనుల నిమిత్తం స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
కొవిడ్కు ముందు.. తర్వాత..
కొవిడ్ ముందు వరకు వ్యాపార లావాదేవీలు బాగానే ఉండడంతో...స్థానిక ఉపాధి, ఎగుమతి, దిగుమతులకు ఢోకా ఉండేది కాదు. కొవిడ్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ముడిసరకుతో పాటు రెడీమేడ్ వస్త్రాల ధరల్లో పెరుగుదల ఉండడంతో స్థానికంగా గిట్టుబాటు కావడం లేదు. గతంలో మాదిరిగా ఆర్డర్లు రావడం లేదని, అరకొరగా వస్తున్న ఆర్డర్లు పూర్తి చేసేందుకు అవసరమైన మహిళా కార్మికులు దొరకడం లేదని..ప్రస్తుతం ఉన్న వారితో నెట్టుకొస్తున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మళ్లీ మూడోదశ కొవిడ్ హెచ్చరికలతో భవిష్యత్తు ఎలా ఉంటుందోనని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
* వస్త్ర పరిశ్రమలు కాస్త గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నా... రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేసిన అమ్మకాలు సాగిస్తున్న వారు లాభాలు పొందుతున్నారు. ప్రత్యేక రాయితీలతో పండగ సీజన్లో పెద్దఎత్తున వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
మార్కెట్ పుంజుకోవాలి...
వస్త్ర పరిశ్రమ నడపడం, పది మంది మహిళలకు ఉపాధి చూపడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కొవిడ్ తర్వాత ముడిసరకు ధరలు బాగా పెరిగిపోయాయి. ఆ మేరకు మార్కెట్లో విక్రయించాలంటే చాలా కష్టతరమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్ పుంజుకోవాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు పరిశ్రమ నిర్వహణలో ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వô ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వస్త్ర పరిశ్రమలను ఆదుకోవాలి.
సువర్ణారెడ్డి, పరిశ్రమ నిర్వాహకురాలు
కుటుంబానికి ఆర్థిక చేయూత
మూడేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్త గాయపడ్డాడు. నేటికీ కాళ్లు సరిగ్గా పని చేయవు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అప్పుడు నేను ఇక్కడ కార్మికురాలిగా చేరా. నా సంపాదనతో ఇంటిని నెట్టుకొస్తూ, పిల్లల్ని చదివిస్తున్నా. మహిళా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
- సాలాపు జగదీ, కుట్టు కార్మికురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!