logo

AP News: పెళ్లి రోజునే భర్త చేతిలో హతం

దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు చివరికి హత్యకు దారి తీశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. రవికుమార్‌(47) తన భార్య వెంకట లలితాదేవి(35)తో కలిసి పదేళ్లుగా శొంఠ్యాంలో జీవిస్తున్నారు.

Updated : 12 Dec 2021 11:54 IST

ఆనందపురం, న్యూస్‌టుడే: దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలు చివరికి హత్యకు దారి తీశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. రవికుమార్‌(47) తన భార్య వెంకట లలితాదేవి(35)తో కలిసి పదేళ్లుగా శొంఠ్యాంలో జీవిస్తున్నారు. కొద్ది కాలంగా భార్యాభర్త మధ్య మధ్య తగాదాలు జరుగుతున్నాయి. శనివారం పెళ్లి రోజు కావడం, బయటకు తీసుకువెళ్లాలని ఆమె కోరడంతో తగాదా తీవ్రరూపం దాల్చి కొట్లాటకు దారితీసింది. కోపోద్రిక్తుడైన రవికుమార్‌ ఇంటిలోని సుత్తితో ఆమె తలపై బలంగా కొట్లాడు. దీంతో లలితాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు సాయితేజాతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని రవికుమార్‌ వివరించారు. సంఘటనా స్థలాన్ని మధురవాడ ఏసీపీ సీహెచ్‌.శ్రీనివాసరావు, సీఐ వై.రవి పరిశీలించారు.

అలా రెండో వివాహం: లలితాదేవి కుటుంబం 15 ఏళ్ల కిందట పెందుర్తి నుంచి శొంఠ్యాం వచ్చింది. తరువాత భర్తకు ఆమె విడాకులు ఇచ్చింది. విజయనగరం కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన ఆండ్రా రవికుమార్‌ను పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అతడు శొంఠ్యాంలోని సాయిబాబా మందిరంలో పూజారిగా పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని