మాటలే ..చేతలేవి?
రోడ్డు ప్రమాదాలు... ఘటనల్లో తీవ్రత తగ్గించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించే రహదారి భద్రత కమిటీ (ఆర్.ఎస్.సి.)సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల అమలు అరకొరగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ప్రతిపాదనలు ఎప్పటికి సాకారం అవుతాయన్న అంశం అంతుపట్టని రీతిలో ఉంది.
అమలుకు నోచని ‘రహదారి భద్రత కమిటీ’ సూచనలు
ఆర్ఎస్సీలో కొన్ని ప్రధాన నిర్ణయాల పరిస్థితి ఇదీ..
ఈనాడు, విశాఖపట్నం: రోడ్డు ప్రమాదాలు... ఘటనల్లో తీవ్రత తగ్గించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించే రహదారి భద్రత కమిటీ (ఆర్.ఎస్.సి.)సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల అమలు అరకొరగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అందులో ప్రతిపాదనలు ఎప్పటికి సాకారం అవుతాయన్న అంశం అంతుపట్టని రీతిలో ఉంది. మరో వైపు నగరంలో జరుగుతున్న ప్రమాదాలు మాత్రం కలవరం రేపుతున్నాయి. ఉన్న 67 బ్లాక్స్పాట్లు ప్రమాదహేతువులుగా మారుతున్నాయి.
*● నగరంలోని జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రహదారిని నిర్మించాలని నిర్ణయించారు.ప్రభుత్వ భూములు ఉన్నచోట్ల కూడా నిర్మించలేదు. ● అడవివరం-గోశాల రహదారి విస్తరణ చేయాలనుకున్నా అమలుకు నోచుకోలేదు. ● ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉన్నచోట్ల మల్టీలెవల్ కార్పార్కింగ్లను నిర్మించాలని తీర్మానించారు. జగదాంబ దగ్గర నిర్మించినది అధికారికంగా ప్రారంభించినా ప్రజలకు అందుబాటులోకి తేలేదు. ● షీలానగర్ నుంచి సబ్బవరం వరకు పోర్టు అనుసంధాన రహదారికి రెవెన్యూ అధికారులు భూసేకరణ సకాలంలో చేయకపోవడంతో నిర్మాణ సంస్థ అధికారులకు నోటీసులిచ్చి పనుల నుంచి వైదొలిగింది. ● ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలు వెలగకపోతే వెంటనే మరమ్మతు చేయాలని నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ● నగరంలోని జాతీయ రహదారిపై 12 పైవంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అధికారిక ఆమోదం లభించలేదు.● బీచ్రోడ్డులో రుషికొండ పరిసర ప్రాంతాల్లో విద్యుద్దీపాలు మరింత కాంతివంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని భావించారు. అది పూర్తికాలేదు.
*● పి.ఎం.పాలెం స్టేడియం నుంచి కొమ్మాది వరకు, గోపాలపట్నం నుంచి పెందుర్తి వరకు రహదారి మధ్య రోడ్డుదాటకుండా గ్రిల్స్ నిర్మాణం పనులు కూడా మొదలుకాలేదు.
వీటికి మోక్షం: ● వడ్లపూడి కూడ లిని అభివృద్ధి చేశారు. ● కార్షెడ్ జంక్షన్ను కొంత ముందుకు మార్చారు. కానీ, కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.● కొమ్మాది కూడలిని అభివృద్ధి చేశారు. ● చంద్రంపాలెం పాఠశాల వద్ద పాదచారులు రోడ్డుదాటడానికి సిగ్నల్ వ్యవస్థ వచ్చింది.
భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..
నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నాం. ఏ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలన్న అంశంపై అధికారులతో కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాం. అమలుకు కృషి చేస్తున్నాం. మిగిలిన వాటిపైనా దృష్టి సారిస్తాం’ అని ఆర్ఎస్సీ ఛైర్మన్, ఎంపీ సత్య నారాయణ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?