logo

బాల్‌బ్యాడ్మింటన్‌ విజేత విశాఖపట్నం జట్టు

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కడప జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొత్తమాధవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన

Published : 15 Jan 2022 05:29 IST

విజేత జట్టుకు బహుమతి అందజేస్తున్న కడప జడ్పీ ఛైర్మన్‌ అమర్‌నాథ్‌రెడ్డి

కొత్తమాధవరం(ఒంటిమిట్ట), న్యూస్‌టుడే: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కడప జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కొత్తమాధవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో విశాఖపట్నం రైల్వే ఈస్ట్‌కోస్ట్‌-ఎ జట్టు విజేతగా నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతి రూ.30 వేలు నగదును గృహ నిర్మాణ సంస్థ డైరెక్టరు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి శుక్రవారం అందజేశారు. వైజాగ్‌ రైల్వే ఈస్ట్‌కోస్ట్‌-బి జట్టు ద్వితీయ స్థానం దక్కించుకోగా వైకాపా నాయకుడు ముమ్మడి శ్రీధర్‌రెడ్డి రూ.20 వేలు ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని