logo

ఉక్కులో ఒప్పంద కార్మికుడి మృతి

ఉక్కు కర్మాగారం బ్యాటరీ-5లో నిర్వహణ పనులు చేస్తున్న ఓ గుత్తేదారు సంస్థలో పని చేస్తున్న ఒప్పంద కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లకన్‌ టొప్పో(52) తన కుటుంబంతో

Published : 15 Jan 2022 05:29 IST

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : ఉక్కు కర్మాగారం బ్యాటరీ-5లో నిర్వహణ పనులు చేస్తున్న ఓ గుత్తేదారు సంస్థలో పని చేస్తున్న ఒప్పంద కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లకన్‌ టొప్పో(52) తన కుటుంబంతో కలిసి పెదగంట్యాడ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. విధుల్లో భాగం సుమారు 80 అడుగుల ఎత్తులోంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. తోటి కార్మికులు వెంటనే అతడిని స్టీల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని