రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు
కశింకోట మండలం కన్నూరుపాలెం సమీపంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదనపు ఎస్సై జె.నాగేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడ సమీపంలోని
ప్రమాదంలో నుజ్జయిన కారు ముందుభాగం
కశింకోట, న్యూస్టుడే: కశింకోట మండలం కన్నూరుపాలెం సమీపంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదనపు ఎస్సై జె.నాగేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడ సమీపంలోని ఇస్లాంపేటకు చెందిన నేవీ ఉద్యోగి మిథులేష్కుమార్ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి నర్సీపట్నం వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇక్కడి సాయిబాబా మందిరం వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న మిథులేష్కుమార్(32)తో సహా ఆయన భార్య రీతూ కుమారి(26), ఇనీషా(6), అనీషా(1), సుమిత్రాదేవీ(57), విన్షీక (5) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవరు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్