logo

గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఈనెల 26న గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఆయన అధికారులతో సమీక్షించారు.

Published : 18 Jan 2022 05:47 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంలోని పోలీసు కవాతు మైదానంలో ఈనెల 26న గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఆయన అధికారులతో సమీక్షించారు. పోలీసు కవాతు మైదానంలో ఏర్పాట్ల పర్యవేక్షణ ఆర్డీఓ, తహసిల్దార్లు.., వివిధ శాఖల స్టాల్సు ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత డీఆర్‌డీఎ పీడీ చూసుకోవాలని ఆదేశించారు. సాంస్కృతిక ప్రదర్శనలను ఇచ్చేందుకు విద్యార్థినీ, విద్యార్ధులను సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ పెంచల కిషోర్‌, డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని