logo

వైకాపా కౌన్సిలర్‌ దాడి..

కనుమ పండగ రోజున ఓ విందు కార్యక్రమంలో ఉన్న తనపై వైకాపా పట్టణ అధ్యక్షుడు, ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణ దాడి చేసి గాయపరిచారంటూ ఆర్టీసీ బస్టాండ్‌లో మీ-సేవ కేంద్రం నడుపుతున్న ఎస్‌.విజయ్‌కుమార్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు

Published : 18 Jan 2022 06:13 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: కనుమ పండగ రోజున ఓ విందు కార్యక్రమంలో ఉన్న తనపై వైకాపా పట్టణ అధ్యక్షుడు, ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ కోనేటి రామకృష్ణ దాడి చేసి గాయపరిచారంటూ ఆర్టీసీ బస్టాండ్‌లో మీ-సేవ కేంద్రం నడుపుతున్న ఎస్‌.విజయ్‌కుమార్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి విందులో ఉండగా అక్కడకు వచ్చిన రామకృష్ణ తొలుత తిట్టారని, తర్వాత ఇంటికి వచ్చి దాడి చేసి గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకున్నానని, సోమవారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. విజయ్‌కుమార్‌పై కౌన్సిలర్‌ రామకృష్ణ కూడా ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని