logo

అడ్డొచ్చిన కుక్క.. నిండుప్రాణం బలి

సెజ్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడిన అభిజీత్‌ ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీ సీనియర్‌ మేనేజరు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి (62) సోమవారం మృతి చెందారు. ఆదివారం ఉదయం విధులకు హాజరైన ఆయన మధ్యాహ్నం భోజనం చేసేందుకు ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం వచ్చారు.

Published : 18 Jan 2022 06:13 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: సెజ్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో గాయపడిన అభిజీత్‌ ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీ సీనియర్‌ మేనేజరు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి (62) సోమవారం మృతి చెందారు. ఆదివారం ఉదయం విధులకు హాజరైన ఆయన మధ్యాహ్నం భోజనం చేసేందుకు ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం వచ్చారు. భోజనం ముగించుకొని తిరిగి కంపెనీకి వెళ్తుండగా.. మహాలక్ష్మి పెట్రోల్‌ బంకు సమీపంలో అడ్డుగా వస్తున్న కుక్కను తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పి రాజశేఖర్‌రెడ్డి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. భోజనానికి వెళ్లేప్పుడు శిరస్త్రాణం పెట్టుకున్న ఆయన తిరిగి వచ్చేప్పుడు పెట్టుకోలేదు. తలకు బలమైన గాయం కావడంతో కంపెనీ ప్రతినిధులు అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. 2011 నుంచి అభిజీత్‌ ఫెర్రో కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారని హెచ్‌ఆర్‌ మేనేజరు అప్పలనాయుడు పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని