logo

ఎన్‌టీఆర్‌ చూపిన మార్గమే స్ఫూర్తి: గంటా

తెదేపా వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్‌ ఆశయాలే పార్టీ శ్రేణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని మంగళవారం తెదేపా కార్యాలయ ఆవరణలో, బీచ్‌రోడ్డులో నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు

Published : 19 Jan 2022 04:59 IST

బీచ్‌రోడ్డులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే గంటా, పార్టీ నేతలు; రక్తదాన శిబిరంలో పాల్గొన్న నేతలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్‌ ఆశయాలే పార్టీ శ్రేణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని మంగళవారం తెదేపా కార్యాలయ ఆవరణలో, బీచ్‌రోడ్డులో నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉందని, పార్టీకి అత్యున్న విధాన నిర్ణాయక కమిటీ ఉందని, ఆ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళతామన్నారు.

● తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్‌టీఆర్‌ ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ, నేతలు పాశర్ల ప్రసాద్‌, సిహెచ్‌.వి.పట్టాభిరామ్‌, వీఎస్‌ఎన్‌ మూర్తి యాదవ్‌, లొడగల కృష్ణ, పుచ్చా విజయకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని