logo

ఆటో నుంచి జారిపడి యువకుడి మృతి

ఫార్మాసిటీ సమీపంలో లంకెలపాలెం ఏలేరు కాలువ వద్ద సోమవారం రాత్రి ఆటో నుంచి జారి పడి యువకుడు మృతి చెందాడు. పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం, పద్మపూర్‌ జిల్లా ఉడార్‌ గ్రామానికి

Published : 19 Jan 2022 05:11 IST

పరవాడ, న్యూస్‌టుడే: ఫార్మాసిటీ సమీపంలో లంకెలపాలెం ఏలేరు కాలువ వద్ద సోమవారం రాత్రి ఆటో నుంచి జారి పడి యువకుడు మృతి చెందాడు. పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం, పద్మపూర్‌ జిల్లా ఉడార్‌ గ్రామానికి చెందిన ఫకీర్‌ బిస్వాల్‌(26) లంకెలపాలెం శివారు సింహాద్రినగర్‌లోని క్యాటరింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఫార్మాసిటీలోని కంపెనీలకు భోజనం సరఫరాచేయడానికి సోమవారం రాత్రి ఆటోలో వెళ్లారు. అనంతరం తిరిగి ఆటోలో లంకెలపాలెం వస్తున్న క్రమంలో ఏలేరు కాలువ వద్ద ఆటో చక్రాలు గుంతలో పడడంతో వెనుక కూర్చొన బిస్వాల్‌ రోడ్డుపై పోడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు తగలడంతో కేజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఏఎస్సై సత్య శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని