logo

పేదల సంక్షేమానికి యువత పాటుపడాలి

పేద ప్రజల సంక్షేమానికి యువకులు పాటుపడాలని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి అన్నారు. ఎలమంచిలిలో విశాఖ డెయిరీ వైస్‌ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలను ఆయన

Published : 21 Jan 2022 04:10 IST


దివ్యాంగులకు, వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఛైర్‌పర్సన్‌ రమాకుమారి

ఎలమంచిలి పట్టణం, న్యూస్‌టుడే: పేద ప్రజల సంక్షేమానికి యువకులు పాటుపడాలని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి అన్నారు. ఎలమంచిలిలో విశాఖ డెయిరీ వైస్‌ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో దివ్యాంగులు, వృద్ధులు, పేదలకు రమాకుమారి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆడారి వెంకట్‌ ఆధ్వర్యంలో కొక్కిరాపల్లి ప్రేమ సమాజంలో అనాథలకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం విశాఖపట్నం వెళ్లి ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆడారి శ్రీధర్‌, పూరి జగన్నాథం, మళ్ల కొండబాబు, జానకీరామ్‌, బొడ్డేటి సురేష్‌, దాడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని