logo

వైఎస్సార్‌ రైతు బాంధవుడు: సత్యవతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి కొనియాడారు. గురువారం భీమవరంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 21 Jan 2022 04:10 IST


వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎంపీ సత్యవతి

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి కొనియాడారు. గురువారం భీమవరంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గుండాలమ్మ అమ్మవారిని దర్శించుకుని, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.   భీమవరంలో బంధువుల ఇంటికి వచ్చే వాళ్లమని, ఇప్పుడు ఎంపీగా రావడం గర్వంగా ఉందన్నారు. గ్రామంలో సామాజిక భవనం, వీధుల్లో సౌర దీపాలు, పెదగుమ్ములూరు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ శారదాకుమారి, గోవిందరావు దంపతులు, జడ్పీటీసీ సభ్యురాలు దేవి, సర్పంచి నూకరాజు, వైస్‌ ఎంపీపీలు అప్పలరాజు, లోవలక్ష్మి,  వైకాపా మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వారంతా ఎంపీని సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు